ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తిరిగి ఎన్నికైనందుకుఅభినందనల ను తెలిపిన ఆర్మేనియా యొక్క ప్రధాని


ద్వైపాక్షికసంబంధాల ను మరింతగా బలపరచుకొనే దిశ లో ఇద్దరు నేతలు వారి నిబద్ధత నుపునరుద్ఘాటించారు

Posted On: 06 JUN 2024 8:58PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఆర్మేనియా యొక్క ప్రధాని శ్రీ నికోల్ పాశిన్‌యాన్ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడుతూ, ఇటీవలే ముగిసిన సాధారణ ఎన్నికల లో శ్రీ నరేంద్ర మోదీ విజయాన్ని సాధించినందుకు అభినందనల ను తెలియ జేశారు.

 

ప్రధాని శ్రీ నికోల్ పాశిన్‌యాన్ కు ప్రధాన మంత్రి ధన్యవాదాల ను పలుకుతూ, రెండు దేశాల మధ్య అన్ని రంగాల లో వృద్ధి చెందుతున్న సహకారాన్ని గురించి ప్రస్తావించారు.

 

నేత లు ఇరువురు భారతదేశం - ఆర్మేనియా ద్వైపాక్షిక సంబంధాల ను మరింత గా బలపరచుకొనే దిశ లో పని చేయాలన్న వారి యొక్క నిబద్ధత ను పునరుద్ఘాటించారు.

 

ఇద్దరు నేత లు ఒకరి తో మరొకరు సంప్రదింపుల ను జరుపుకొంటూ ఉండడానికి అంగీకరించారు.



(Release ID: 2023435) Visitor Counter : 76