ప్రధాన మంత్రి కార్యాలయం
ఇండియా- ఇఎఫ్టిఎ ట్రేడ్ ఎండ్ ఇకానామిక్ పార్ట్ నర్ శిప్ అగ్రీమెంట్ ఆర్థిక పురోగతి నిపెంపొందింపచేయడం తో పాటు మన యువత కోసం అవకాశాల ను కల్పించాలన్న మా నిబద్ధత ను స్పష్టంచేస్తోంది: ప్రధాన మంత్రి
Posted On:
10 MAR 2024 8:15PM by PIB Hyderabad
ఇండియా – ఇఎఫ్ టిఎ ట్రేడ్ ఎండ్ ఇకానామిక్ పార్ట్ నర్ శిప్ అగ్రీమెంట్ పై సంతకాలు జరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రశంస ను వ్యక్తం చేశారు.
ఈ ఒప్పందం పై సంతకాలు జరిగిన ఘట్టానికి సంబంధించి ప్రధాన మంత్రి తన సందేశాన్ని కూడా శేర్ చేశారు.
కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన సందేశానికి ప్రధాన మంత్రి ఈ క్రింది విధం గా ప్ర్రత్యుత్తరాన్ని ఇచ్చారు :
‘‘ఇండియా – ఇఎఫ్ టిఎ ట్రేడ్ ఎండ్ ఇకానామిక్ పార్ట్ నర్ శిప్ అగ్రీమెంట్ పై సంతకాలు జరుతుండడం తో సంతోషం కలిగింది. ఈ చరిత్రాత్మకమైనటువంటి ఒప్పందం ఆర్థిక ప్రగతి ని పెంపొందింపచేయడం తో పాటు గా మన యువత కోసం అవకాశాల ను కల్పించాలన్న మా యొక్క నిబద్ధత ను స్పష్టం చేస్తున్నది. ఇఎఫ్ టిఎ దేశాలతో మన బంధాన్ని మనం బలపరచుకొంటూ ఉండడం వల్ల రాబోయే కాలాలు మరింత అధిక సమృద్ధి ని మరియు పరస్పర వృద్ధి ని కూడా కొనితెస్తాయి.’’
(Release ID: 2013370)
Visitor Counter : 97
Read this release in:
Tamil
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam