ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లత మంగేశ్‌కర్ గారు పాడిన శ్రీ రామ రక్ష లోనిశ్లోకాన్ని శేర్ చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 17 JAN 2024 8:10AM by PIB Hyderabad

శ్రీ రామ రక్ష స్తోత్రం తాలూకు ‘‘మాతా రామో మత్పితా రామచంద్రః’’ శ్లోకాన్ని లత మంగేశ్‌కర్ గారు పాడగా ఆ యొక్క శ్లోకాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాజా గా శేర్ చేశారు.

 

ఇది ఆ ప్రసిద్ధ గాయని పాడగా రికార్డు చేసినటువంటి చివరి శ్లోకం.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘దేశ ప్రజలు జనవరి 22 వ తేదీ రాక కోసం ఎక్కడ లేనటువంటి ఉత్సాహం తో వేచి ఉన్న తరుణం లో, ఫలానా వ్యక్తులు మన మధ్యన ఉంటే బాగుండును అనేటటువంటి భావన కలిగే వారి లో ఒకరు మనకు ప్రియతమురాలు అయిన లత దీదీ కూడా అని చెప్పుకోవాలి.

ఆమె పాడిన ఒక శ్లోకాన్ని ఇక్కడ ఇవ్వడమైంది. ఇది ఆమె పాడగా రికార్డు చేసినటువంటి ఆఖరి శ్లోకం అని ఆవిడ కుటుంబ సభ్యులు నాతో చెప్పారు.

#ShriRamBhajan” అని పేర్కొన్నారు.

 

 

***

DS/ST


(रिलीज़ आईडी: 1996898) आगंतुक पटल : 126
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam