ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడితో ప్రధాని సమావేశం

Posted On: 01 DEC 2023 9:36PM by PIB Hyderabad

సెంబర్ 1న యూఏఈలో జరిగిన కాప్-28 సమ్మిట్ సందర్భంగా రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు శ్రీ షావ్కత్ మిర్జియోయెవ్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. 
వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్‌లో ఉజ్బెకిస్థాన్ పాల్గొన్నందుకు ప్రెసిడెంట్ మిర్జియోయెవ్‌కు ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

ఆరోగ్యం, విద్య, ఫార్మాస్యూటికల్స్, సాంప్రదాయ వైద్య రంగాలలో విస్తృత శ్రేణి ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకోవడంపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. ఉజ్బెకిస్థాన్‌తో మన అభివృద్ధి భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు భారతదేశం మద్దతు ఉంటుందని కూడా ప్రధాన మంత్రి హామీ ఇచ్చారు.

 

 

***


(Release ID: 1982051) Visitor Counter : 147