ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియన్ పారా గేమ్స్ లో పురుషుల 50 మీటర్ల బటర్ ఫ్లై-ఎస్ 7లో కాంస్య పతకం సాధించిన సుయాష్ జాదవ్ కు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

Posted On: 27 OCT 2023 6:46PM by PIB Hyderabad

హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియన్  పారా గేమ్స్  లో పురుషుల  50 మీటర్ల బటర్ ఫ్లై-ఎస్ 7 ఈవెంట్  లో కాంస్య పతకం సాధించినందుకు సుయాష్  జాదవ్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఎక్స్  లో ప్రధానమంత్రి ఈ మేరకు ఒక సందేశం పోస్ట్  చేశారు.

‘‘పురుషుల లాంగ్  50 మీటర్ల బటర్ ఫ్లై-ఎస్ 7లో అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకం సాధించిన సుయాష్  జాదవ్ ను అభినందిస్తున్నాను. పట్టుదల, అభిరుచి ఉంటే విజయం సాధించగలమని అతను నిరూపించాడు. అతని విజయం పట్ల భారత్ అమితానందంలో ఉంది’’ అని పేర్కొన్నారు.  



(Release ID: 1972447) Visitor Counter : 92