ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా పారాగేమ్స్‌ ఆర్చరీలో స్వర్ణం సాధించిన శీతల్‌ దేవి.. రాకేష్‌కుమార్‌లకు ప్రధాని ప్రశంసలు

Posted On: 26 OCT 2023 9:27PM by PIB Hyderabad

   సియా పారాగేమ్స్‌ ఆర్చరీలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న శీతల్‌ దేవి, రాకేష్‌ కుమార్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“పారా ఆర్చరీ మిక్స్‌డ్‌ విభాగంలో భారత జోడీ అసాధారణ ప్రతిభకు ఈ స్వర్ణం నిదర్శనం. శీతల్‌ దేవి, రాకేష్‌ కుమార్‌ల అసమాన ప్రతిభా ప్రదర్శనకు నా అభినందనలు. క్రీడలో వారి గురి, అంకిత భావం, తిరుగులేని నైపుణ్యాలకు ఈ విజయం ఒక ఉదాహరణ” అని ప్రధానమంత్రి ప్రశంసించారు.



(Release ID: 1971827) Visitor Counter : 96