ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఏశియాన్ పారాగేమ్స్ 2022 లో ధనుర్విద్య లో పురుషుల డబల్స్- డబ్ల్యు1 పోటీ లో కాంస్య పతకాన్నిశ్రీ ఆదిల్ మొహమద్ నజీర్ అన్సారీ మరియు శ్రీ నవీన్ దలాల్ లు గెలిచినందుకుసంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 26 OCT 2023 11:47AM by PIB Hyderabad

చైనా లోని హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో ఆర్చరీ మెన్స్ డబల్స్-డబ్ల్యు1 పోటీ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు శ్రీ ఆదిల్ మొహమద్ నజీర్ అన్సారీ కి మరియు శ్రీ నవీన్ దలాల్ కు అభినందల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

 

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘విలువిద్య మెన్స్ డబల్స్-డబ్ల్యు1 పోటీ లో విశిష్ఠమైన రీతి లో కంచు పతకాన్ని గెలిచినందుకు గాను శ్రీ ఆదిల్ మొహమద్ నజీర్ అన్సారీ కి మరియు శ్రీ నవీన్ దలాల్ కు హృదయ పూర్వకమైన అభినందన లు.

వారి కచ్ఛితత్వం, టీమ్ వర్క్, ఇంకా ఊగిసలాడనటువంటి దృఢ సంకల్పం లు మన దేశాని కి గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. వారు ఎల్లప్పుడూ ఉన్నత లక్ష్యాల ను నిర్దేశించుకొంటూ ఉందురు గాక. ఈ అసాధారణమైన కార్యసాధన ను భారతదేశం గొప్ప గర్వం తో వేడుక వలె జరుపుకొంటున్నది.’’ అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 1971358) సందర్శకుల సూచీ సంఖ్య : : 153