ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన-వేగవంతమైన నీటిపారుదల ప్రయోజన కార్యక్రమం (పిఎంకెఎస్‌వై-ఏఐబిపి) కింద ఉత్తరాఖండ్‌లోని జమ్రానీ డ్యామ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్‌ను చేర్చడానికి ఆమోదం తెలిపిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ


పిఎంకెఎస్‌వై-ఏఐబిపి కింద ప్రాజెక్ట్ యొక్క మిగులు పనులు పూర్తి కోసం కేంద్ర సహాయం 90 రాష్ట్ర నిష్పత్తి 10

ఉత్తరాఖండ్‌కు రూ.1,557.18కోట్ల కేంద్ర సహాయంతో సహా ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,584.10కోట్లు

షెడ్యూల్ ప్రకారం ప్రాజెక్ట్ పూర్తి మార్చి, 2028

ప్రాజెక్టు ద్వారా ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ & ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలు, ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ & బరేలీ జిల్లాల్లో 57 వేల హెక్టార్లకు అదనపు నీటిపారుదల

అదనంగా హల్ద్వానీ మరియు సమీప ప్రాంతాలకు 42.70 మిలియన్ క్యూబిక్ మీటర్ (ఎంసిఎం) త్రాగునీరు 10.65 లక్షల కంటే ఎక్కువ జనాభాకు ప్రయోజనం చేకూరుస్తుంది.

14 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ స్థాపిత సామర్థ్యంతో సుమారు 63.4 మిలియన్ యూనిట్ల జల విద్యుత్ ఉత్పత్తి


Posted On: 25 OCT 2023 3:18PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసిఈఏ), ఉత్తరాఖండ్‌లోని జమ్రానీ డ్యామ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్‌ను ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన-వేగవంతమైన నీటిపారుదల ప్రయోజన కార్యక్రమం (పిఎంకెఎస్‌వై-ఏఐబిపి) కింద జలవనరుల శాఖ కింద ఆధ్వర్యంలోని నది అభివృద్ధి మరియు గంగా పునరుజ్జీవనం పథకంలో చేర్చడానికి ఆమోదం తెలిపింది.

మార్చి, 2028 నాటికి రూ.2,584.10 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఉత్తరాఖండ్‌కు రూ.1,557.18 కోట్ల కేంద్ర మద్దతును అందించేందుకు సిసిఈఏ ఆమోదించింది.

ఈ ప్రాజెక్ట్ ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో రామ్ గంగా నదికి ఉపనది అయిన గోలా నదికి అడ్డంగా జమ్రానీ గ్రామం దగ్గర ఒక ఆనకట్టను నిర్మించాలని భావిస్తుంది. 1981లో పూర్తయిన దాని 40.5 కి.మీ పొడవు కాలువ వ్యవస్థ మరియు 244 కి.మీ పొడవు గల కాలువ వ్యవస్థ ద్వారా ప్రస్తుత గోల బ్యారేజీకి ఈ ఆనకట్ట అందించబడుతుంది.

ఈ ప్రాజెక్ట్ ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ & ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలు మరియు ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ & బరేలీ జిల్లాల్లో 57,065 హెక్టార్లకు (ఉత్తరాఖండ్‌లో 9,458 హెక్టార్లు మరియు ఉత్తరప్రదేశ్‌లో 47,607 హెక్టార్లు) అదనపు నీటిపారుదలని అందిస్తోంది. రెండు కొత్త ఫీడర్ కాలువల నిర్మాణంతో పాటు ఇప్పటికే ఉన్న 207 కి.మీ కాల్వలను పునరుద్ధరించడంతోపాటు 278 కి.మీ పక్కా ఫీల్డ్ ఛానల్స్ కూడా ప్రాజెక్ట్ కింద చేపడుతోంది. వీటితో పాటు  ప్రాజెక్ట్ 14 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తిని అలాగే హల్ద్వానీ మరియు సమీప ప్రాంతాలకు 42.70 మిలియన్ క్యూబిక్ మీటర్ (ఎంసిఎం) త్రాగునీటిని అందించడంతోపాటు 10.65 లక్షల జనాభాకు పైగా ప్రయోజనం కలిగిస్తుంది.

 ప్రాజెక్ట్ యొక్క నీటిపారుదల ప్రయోజనాలలో గణనీయమైన భాగం పొరుగు రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు ప్రవహిస్తుంది మరియు 2017లో సంతకం చేసిన అవగాహన ఒప్పందం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఖర్చు/ప్రయోజనాల భాగస్వామ్యం జరగాలి. అయితే తాగునీరు మరియు విద్యుత్ ప్రయోజనాలు పూర్తిగా ఉత్తరాఖండ్‌కు అందుబాటులో ఉంటాయి.

నేపథ్యం:
ప్రధాన్ మంత్రి కృషి సించాయీ యోజన (పిఎంకెఎస్‌వై) 2015-16 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇది పొలంలో నీటి భౌతిక ప్రాప్యతను మెరుగుపరచడం మరియు హామీ ఇవ్వబడిన నీటిపారుదల కింద సాగు యోగ్యమైన ప్రాంతాన్ని విస్తరించడం, వ్యవసాయ నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, స్థిరమైన నీటి సంరక్షణ పద్ధతులను పరిచయం చేయడం వంటి లక్ష్యంతో ప్రారంభించబడింది.  భారత ప్రభుత్వం రూ.93,068.56 కోట్ల (కేంద్ర సహాయం రూ. 37,454 కోట్లు) మొత్తం వ్యయంతో 2021-26లో పిఎంకెఎస్‌వై అమలును ఆమోదించింది. పిఎంకెఎస్‌వై  యొక్క యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్ (ఏఐబిపి) భాగం ప్రధాన మరియు మధ్యస్థ నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా నీటిపారుదల సామర్థ్యాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. పిఎంకెఎస్‌వై-ఏఐబిపి కింద ఇప్పటివరకు 53 ప్రాజెక్టులు పూర్తయ్యాయి మరియు 25.14 లక్షల హెక్టార్లకు అదనపు నీటిపారుదల వ్యవస్థ సృష్టించబడింది. 2021-22 నుండి పిఎంకెఎస్‌వై 2.0 యొక్క ఏఐబిపి భాగం తర్వాత ఆరు ప్రాజెక్ట్‌లు చేర్చబడ్డాయి. జమ్రానీ డ్యామ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ జాబితాలో చేర్చబడిన ఏడవ ప్రాజెక్ట్.


 

***



(Release ID: 1970934) Visitor Counter : 125