ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎన్ఎస్ జి సిబ్బంది కి వారి సంస్థ స్థాపక దినంసందర్భం లో శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 16 OCT 2023 3:47PM by PIB Hyderabad

నేశనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్ జి) సిబ్బంది కి వారి సంస్థ యొక్క స్థాపక దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలిపారు.

 

 

ఈ సందర్భం లో, ఆ దళాని కి చెందిన సాహసికులైన సిబ్బంది అందరిని ప్రధాన మంత్రి ప్రశంసించారు, వారు వారి యొక్క విధి నిర్వహణ క్రమం లో అచంచలమైనటువంటి వృత్తి కుశలత ను, మన దేశ ప్రజల పట్ల అవ్యాజమైన ప్రేమ ను మరియు అజేయమైనటువంటి సాహసాన్ని చాటారని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని పోస్ట్ చేస్తూ, ఆ సందేశం లో -

 

‘‘ఎన్ఎస్ జి సిబ్బంది అందరికి వారి సంస్థ యొక్క స్థాపక దినం సందర్భం లో ఇవే శుభాకాంక్షలు.

 

ఒక విశిష్టమైన దళం గా @nsgblackcats తమను తాము సుప్రతిష్ఠితం చేసుకొన్నారు. వారు మనల ను వేరు వేరు బెదరింపుల బారి నుండి సంరక్షిస్తూ వస్తున్నారు.

 

‘‘దళాని కి చెందిన సాహసిక సిబ్బంది అందరిని ఈ ప్రత్యేక సందర్భం లో నేను ప్రశంసిస్తున్నాను; వారు వారి యొక్క విధుల ను నిర్వహించే క్రమం లో, అచంచలమైనటువంటి వృత్తి నైపుణ్యాన్ని, మన దేశ ప్రజల పట్ల ఘనమైన ప్రేమ ను మరియు అజేయమైనటువంటి సాహసాన్ని చాటారు.’’ అని పేర్కొన్నారు.

 


(Release ID: 1968268)