ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో కాంస్యం సాధించిన హెచ్.ఎస్.ప్రణయ్కు ప్రధాని అభినందన

Posted On: 06 OCT 2023 6:13PM by PIB Hyderabad

   సియా క్రీడ‌ల‌ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో భారత షట్లర్‌ హెచ్‌.ఎస్.ప్రణయ్ అద్భుత ప్రతిభతో కాంస్య పతకం సాధించాడని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“ఆసియా క్రీడల పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో కాంస్యం సాధించడం ద్వారా హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ @PRANNOYHSPRI చూపిన అద్భుత ప్రతిభను చూసి పులకించాను! అచంచలమైన సంకల్పం, మొక్కవోని దీక్ష ఔత్సాహిక క్రీడాకారులకు పాఠాలు. బ్రేవో, ప్రణయ్! నీ విజయాన్ని దేశం వేడుక చేసుకుంటుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/ST



(Release ID: 1965266) Visitor Counter : 73