ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా క్రీడల మహిళల 400 మీటర్ల హర్డిల్స్లో విద్యా రామ్రాజ్కు కాంస్యం; ప్రధానమంత్రి అభినందన

Posted On: 03 OCT 2023 9:31PM by PIB Hyderabad

   సియా క్రీడల మహిళల 400 మీటర్ల హర్డిల్‌సలో కాంస్య పతకం సాధించిన భారత క్రీడాకారిణి విద్యా రామ్‌రాజ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. ఆద్యంతం పట్టువీడని దృఢ సంకల్పంతో ఈ పాతికేళ్ల యువ క్రీడాకారిణి అద్భుతంగా రాణించిందంటూ ఆయన కొనియాడారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో కాంస్య పతక విజేత విద్యా రామ్‌రాజ్‌కు అభినందనలు. ఆమె పట్టుదల, దృఢ సంకల్పమే ఈ అద్భుత ప్రదర్శనకు తోడ్పడ్డాయి. భవిష్యత్తులో ఆమె మరింత విలువైన విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/RT



(Release ID: 1963931) Visitor Counter : 67