ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల ‘ఐఎల్‌సిఎ4'-డింగీ బాలికల విభాగంలో రజతం సాధించిన నేహా ఠాకూర్‌కు ప్రధాని అభినందన

Posted On: 26 SEP 2023 6:02PM by PIB Hyderabad

   ఆసియా క్రీడల ‘ఐఎల్‌సిఎ4'-డింగీ బాలికల విభాగంలో రజత పతకం కైవసం చేసుకున్న నేహా ఠాకూర్‌ను ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ పోస్టు ద్వారా పంపిన సందేశంలో:  న్న

“అంకిత భావానికి, పట్టువీడని దీక్షకు ఇది ఉజ్వల ఉదాహరణ! మన నేహా ఠాకూర్‌ ‘ఐఎల్‌సిఎ4'-డింగీ బాలికల విభాగంలో రజత పతకం కైవసం చేసుకుంది. ఈ అద్భుత ప్రదర్శన ఆమె కఠోర పరిశ్రమకు, ప్రతిభకు ఒక నిదర్శనం. ఈ మేరకు ఆమెను అభినందించి, ఆశీర్వదిస్తూ, భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(Release ID: 1961148)