ప్రధాన మంత్రి కార్యాలయం

తమిళనాడులోని తిరుపత్తూరు రోడ్డు ప్రమాదంలో ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి సంతాపం


మృతుల కుటుంబాలకు ‘పిఎంఎన్‌ఆర్‌ఎఫ్‌’ నుంచి పరిహారం ప్రకటన

Posted On: 11 SEP 2023 6:13PM by PIB Hyderabad

మిళనాడులోని తిరుపత్తూరులో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈ దుర్ఘటనలో మరణించినవారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి రూ.2 లక్షల వంతున, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున ఆయన పరిహారం ప్రకటించారు.

దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్‌’ పోస్ట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“తమిళనాడులోని తిరుపత్తూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడంపై దిగ్భ్రాంతి కలిగించింది. ఈ దుర్ఘటనలో మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధినుంచి రూ.2 లక్షల వంతున, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం అందజేయబడుతుంది: ప్రధానమంత్రి @narendramodi” అని ప్రధాని ప్రకటించినట్లు పేర్కొంది.

 

******

DS/ST



(Release ID: 1956511) Visitor Counter : 118