ప్రధాన మంత్రి కార్యాలయం

సుస్థిరత.. పరిశుభ్ర ఇంధనం దిశగా ప్రపంచ జీవ ఇంధన కూటమి మేలిమలుపు: ప్రధాన మంత్రి

Posted On: 09 SEP 2023 6:49PM by PIB Hyderabad

   ప్రపంచ జీవ ఇంధన కూటమిలో సభ్యత్వం స్వీకరించిన దేశాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది సుస్థిరత, పరిశుభ్ర ఇంధనం దిశగా అన్వేషణలో ఇదొక మేలిమలుపని ఆయన నొక్కిచెప్పారు.

   ఈ మేరకు కేంద్ర పెట్రోలియం-ఇంధన శాఖ మంత్రి శ్రీ హర్‌దీప్ పూరి ‘ఎక్స్‌’ పోస్ట్‌ ద్వారా పంపిన సందేశాన్ని ప్రజలతో పంచుకుంటూ:

“ప్రపంచ జీవ ఇంధన కూటమి  ప్రారంభం స్థిరత్వం, స్వచ్ఛమైన ఇంధనం దిశగా మన అన్వేషణలో ఒక మేలిమలుపును సూచిస్తుంది. కూటమిలో సభ్యత్వం స్వీకరించిన దేశాలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/TS



(Release ID: 1955912) Visitor Counter : 148