గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఏ బీ పీ ఎస్) పురోగతి పై సమీక్ష జరిగింది మరియు వేతన చెల్లింపు యొక్క మిశ్రమ మార్గం ( ఎన్ ఎ సి హెచ్ మరియు ఏ బీ పీ ఎస్ మార్గం) 31 డిసెంబర్ 2023 వరకు లేదా తదుపరి ఉత్తర్వు వరకు పొడిగించబడింది


ఉపాధి కోసం వచ్చే లబ్ధిదారులను ఆధార్ నంబర్‌ను అందించమని అభ్యర్థించాలని, అయితే దీని ఆధారంగా ఉపాధిని తిరస్కరించబోమని మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు స్పష్టం చేసింది.

Posted On: 30 AUG 2023 11:34AM by PIB Hyderabad

ఉపాధి హామీ పథకం లబ్ధిదారుడు అనేక సందర్భాల్లో బ్యాంకు ఖాతా నంబర్‌లో తరచూ మార్పులు చేయడం మరియు సంబంధిత ప్రోగ్రామ్ ఆఫీసర్ కొత్త ఖాతా నంబర్‌ను అప్‌డేట్ చేయకపోవడం వల్ల, లబ్దిదారుడు సకాలంలో కొత్త ఖాతానంబర్‌ ను సమర్పించనందున అనేక వేతన చెల్లింపు  లావాదేవీలు గమ్యస్థాన బ్యాంకు శాఖ ద్వారా తిరస్కరించబడుతున్నాయని (పాత ఖాతా సంఖ్య కారణంగా)కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

 

వివిధ వాటాదారులతో సంప్రదించి, అటువంటి తిరస్కరణలను నివారించడానికి, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డి బి టీ) ద్వారా వేతన చెల్లింపు చేయడానికి ఆధార్ చెల్లింపుల వంతెన వ్యవస్థ ఉత్తమ మార్గం అని నిర్ధారణ అయ్యింది. ఇది లబ్ధిదారులకు సకాలంలో వేతనాలు అందజేయడంలో  దోహదపడుతుంది.

 

పథకం డేటాబేస్‌లో ఆధార్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత, ప్రాంతం లో మార్పు లేదా బ్యాంక్ ఖాతా నంబర్‌లో మార్పు కారణంగా లబ్ధిదారు ఖాతా నంబర్‌లను అప్‌డేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ నంబర్‌తో లింక్ చేయబడిన ఖాతా నంబర్‌కు డబ్బు నేరుగా బదిలీ చేయబడుతుంది. ఎం జీ ఎన్ ఆర్ జీ ఏ ఉపాధి పథకం లో  ఒకటి కంటే ఎక్కువ ఖాతాలున్న చాలా అరుదైన లబ్ధిదారుల  విషయంలో లబ్ధిదారుడు తన బదిలీ ఖాతాను ఎంచుకోవడానికి ఎంపిక అవకాశం ఉంటుంది.

 

డి బి టీ కోసం ఆధార్‌ను అనుసంధానం చేసిన చోట 99.55% లేదా అంతకంటే ఎక్కువ విజయవంతమైన శాతం ఉందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డేటా చూపిస్తుంది. ఖాతా ఆధారిత చెల్లింపు విషయంలో అటువంటి విజయం దాదాపు 98%.

 

ఏ పీ బీ ఎస్ నిజమైన లబ్ధిదారులకు వారి బకాయిలు పొందడానికి సహాయం చేస్తోంది అలాగే నకిలీ లబ్ధిదారులను ఏరివేయడం ద్వారా అవినీతిని అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మహాత్మా గాంధీ ఎన్ ఆర్ జీ ఎస్ ఆధార్-ఆధారిత చెల్లింపును స్వీకరించలేదు. ఈ పథకం ఆధార్ ఆధారిత చెల్లింపు వంతెన వ్యవస్థను ఎంచుకుంది. ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఏ బీ పీ ఎస్) పురోగతి సమీక్షించబడింది మరియు వేతన చెల్లింపు యొక్క మిశ్రమ మార్గం (ఎన్ ఎ సి హెచ్ మరియు ఏ బీ పీ ఎస్ మార్గం) 31 డిసెంబర్ 2023 వరకు లేదా తదుపరి ఉత్తర్వు వరకు పొడిగించబడింది. ఉపాధి కోసం వచ్చే లబ్ధిదారుని ఆధార్ నంబర్‌ను అందించమని అభ్యర్థించాలని, అయితే దీని ఆధారంగా ఉపాధిని తిరస్కరించవద్దని మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఒక లబ్ధిదారుడు పని కోసం డిమాండ్ చేయకపోతే, అటువంటి సందర్భంలో ఏ పీ బీ ఎస్ అర్హత గురించి ఆమె/అతని స్థితి ఉపాధి డిమాండ్‌పై ప్రభావం చూపదు. కార్మికుడు ఏ పీ బీ ఎస్కి అర్హత పొందలేదనే కారణంతో జాబ్ కార్డ్‌లను తొలగించలేము.

 

మహాత్మా గాంధీ ఎన్ ఆర్ జీ ఎస్ పథకం కింద ఏ పీ బీ ఎస్ 2017 నుండి వాడుకలో ఉంది. ప్రతి వయోజన జనాభాకు దాదాపుగా సార్వత్రిక ఆధార్ సంఖ్య అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు భారత ప్రభుత్వం ఎన్ ఆర్ జీ ఎస్ పథకం కింద లబ్ధిదారులకు ఏ పీ బీ ఎస్ని పొడిగించాలని నిర్ణయించింది. ఏ పీ బీ ఎస్ తో అనుబంధించబడిన ఖాతాకు మాత్రమే ఏ పీ బీ ఎస్ ద్వారా చెల్లింపు జరుగుతుంది, అంటే ఇది చెల్లింపు బదిలీకి సురక్షితమైన మరియు వేగవంతమైన మార్గం.

 

మొత్తం 14.33 కోట్ల మంది క్రియాశీల లబ్ధిదారులలో 13.97 కోట్ల మందికి ఆధార్ సీడింగ్ చేయబడింది. ఈ  ఆధార్‌ సీడెడ్ లో మొత్తం 13.34 కోట్ల ఆధార్‌లు ప్రామాణీకరించబడ్డాయి మరియు 81.89% క్రియాశీల కార్మికులు ఇప్పుడు ఏ పీ బీ ఎస్ కి అర్హులు. జూలై 2023 నెలలో, దాదాపు 88.51% వేతన చెల్లింపు ఏ పీ బీ ఎస్ ద్వారా చేయబడింది.

 

మహాత్మా గాంధీ ఎన్ ఆర్ జీ ఎ అనేది డిమాండ్ ఆధారిత ఉపాధి పథకం అది వివిధ ఆర్థిక కారకాలచే ప్రభావితమవుతుంది. ఏ పీ బీ ఎస్ కోసం సరైన పర్యావరణ వ్యవస్థ ఉంది. లబ్ధిదారులకు ఏ పీ బీ ఎస్ యొక్క ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే,ఇది చెల్లింపు కోసం అనుసరించాల్సిన ఉత్తమ వ్యవస్థ.

 

ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ అనేది లబ్ధిదారుల ఖాతాలో నేరుగా చెల్లింపు జమ అయ్యే మార్గం. ఈ వ్యవస్థలో బాగా స్పష్టమైన విధానదశలు ఉన్నాయి అలాగే లబ్ధిదారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది  మరియు  ఇతర లబ్దిదారుల పాత్ర స్పష్టంగా నిర్వచించబడింది.

 

***



(Release ID: 1953535) Visitor Counter : 219