ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత పురుషుల 4x400 మీటర్ల రిలే బృందం అద్భుత ప్రతిభకు ప్రధాని ప్రశంస

ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌లో ఫైనల్స్‌కు అర్హత సాధించిన జట్టు

Posted On: 27 AUG 2023 6:21PM by PIB Hyderabad

   ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌లో భారత పురుషుల 4x400 మీటర్ల రిలే పరుగు జట్టు అద్భుత ప్రతిభ చూపి, ఫైనల్స్‌ చేరిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ మేరకు అర్హత సాధించడంలో జట్టు సభ్యులు అనాస్, అమోజ్, రాజేష్ రమేష్, ముహమ్మద్ అజ్మల్ చూపిన సమష్టి కృషి అభినందనీయమన్నారు. 

ఈ మేరకు ‘ఎక్స్‌’ పోస్ట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌లో సమష్టి కృషి అద్భుతం! అనాస్, అమోజ్, రాజేష్ రమేష్, ముహమ్మద్ అజ్మల్ తమ ప్రతిభతో జట్టును ఫైనల్స్‌ చేర్చడమే కాకుండా 4x400 మీటర్ల రిలే పరుగులో సరికొత్త ఆసియా రికార్డు నెలకొల్పడం ముదావహం. ఈ విన్యాసం ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత చరిత్రాత్మక పునరాగమనంగా చిరకాలం గుర్తుంటుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.




****


DS/ST


(Release ID: 1952776) Visitor Counter : 143