ప్రధాన మంత్రి కార్యాలయం

ఇజ్ రాయల్ప్రధాని తో మాట్లాడిన ప్రధాన మంత్రి


భారతదేశం యొక్క చంద్రయాన్-3 మిశన్ సఫలం అయినందుకు ప్రధాన మంత్రి కి అభినందనల నుతెలిపిన ప్రధాని శ్రీ నెతన్యాహు

శుభాకాంక్షల నుతెలియజేసినందుకు శ్రీ నెతన్యాహు కు ధన్యవాదాలు పలికిన ప్రధాన మంత్రి

Posted On: 24 AUG 2023 10:00PM by PIB Hyderabad

చందమామ యొక్క దక్షిణ ధృవం మీద చంద్రయాన్-3 విజయవంతం గా దిగడం తో, ఇజ్ రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహు టెలిఫోన్ ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మాట్లాడి, తన అభినందనల ను తెలియజేశారు.
ఈ స్నేహపూర్వకం అయినటువంటి మరియు శుభాకాంక్షల కు గాను ప్రధాన మంత్రి ప్రశంసలను వ్యక్తం చేస్తూ, భారతదేశం యొక్క ప్రజల తరుఫున ఆయన కు ధన్యవాదాల ను తెలియజేశారు. చంద్రయాన్ యొక్క విజయం యావత్తు మానవాళి కి, ప్రత్యేకించి వికాసశీల దేశాల కు శుభ సూచన అని ప్రధాన మంత్రి అన్నారు.
నేతలు ఇరువరు ఒకరితో మరొకరు సంప్రదింపులు జరుపుకోవడాన్ని కొనసాగించుదాం అంటూ సమ్మతి ని వ్యక్తం చేశారు.

 

***/

 



(Release ID: 1952190) Visitor Counter : 89