ప్రధాన మంత్రి కార్యాలయం

ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ స్టేషన్ నుంచి రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని


గోరఖ్ పూర్ రైల్వే స్టేషన్ పునరభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన

Posted On: 07 JUL 2023 8:09PM by PIB Hyderabad

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ రైల్వే స్టేషన్ నుంచి రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ళను ప్రారంభించారు. ఈ రెండు రైళ్లలో ఒకటి గోరఖ్ పూర్- లక్నో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కాగా, రెండోది జోధ్ పూర్- అహమ్మదాబాద్ (సబర్మతి) వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు. రూ.498 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న గోరఖ్ పూర్ రైల్వే స్టేషన్ పునరభివృద్ధి పనులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రధాని వెంట ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీ బెన్  పటేల్,  ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, గోరఖ్ పూర్ ఎంపీ శ్రీ రవి కిషన్ ఉన్నారు.  .

నేపథ్యం

గోరఖ్ పూర్- లక్నో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు అయోధ్య గుండా వెళుతుంది. రాష్ట్రంలో ముఖ్యమైన నగరాల గుండా వెళ్ళటం ద్వారా అనుసంధానత పెంచుతూ, పర్యాటకాభివృద్ధికి దోహదపడుతుంది. జోధ్ పూర్ – సబర్మతి  వందే భారత్ ఎక్స్ ప్రెస్ జోధ్ పూర్, అబూ రోడ్, అహమ్మదాబాద్ లాంటి ప్రముఖ స్థలాలకు అనుసంధానత పెంచుతుంది.  ఆ విధంగా ఈ ప్రాంత సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసినట్టావుతుంది.  

గోరఖ్ పూర్ రైల్వేస్టేషన్ పునరభివృద్ధి పనులకు రూ. 498 కోట్లు వెచ్చించటానికి సిద్ధమై శంకుస్థాపన చేయగా ఈ పనులు పూర్తయితే ప్రయాణీకులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. 

***



(Release ID: 1938108) Visitor Counter : 133