ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్ర లోని ధులే లో జరిగిన దుర్ఘటన కారణం గాప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి పరిహారాన్ని ప్రకటించారు
Posted On:
04 JUL 2023 9:40PM by PIB Hyderabad
మహారాష్ట్ర లోని ధులే లో ఒక దుర్ఘటన జరిగిన కారణం గా ప్రాణ నష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన లో మరణించిన వ్యక్తుల యొక్క దగ్గరి సంబంధికుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి 2 లక్షల రూపాయల వంతున మరియు గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున పరిహారాన్ని ప్రధాన మంత్రి ప్రకటించారు
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘మహారాష్ట్ర లోని ధులే లో జరిగిన దుర్ఘటన దుఃఖదాయకం గా ఉంది. ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు ఇదే సంతాపం. ఈ దుర్ఘటన లో క్షతగాత్రులు త్వరగా పునఃస్వస్థులు అవ్వాలని ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను. మృతుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి @narendramodi’’ అని తెలిపింది.
***
DS/ST
(Release ID: 1937463)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam