ప్రధాన మంత్రి కార్యాలయం

స్వామిహ్‌ నిధి తొలి ప్రాజెక్టు కింద గృహాలు పొందినవారికి ప్రధానమంత్రి అభినందనలు

Posted On: 03 JUL 2023 9:03PM by PIB Hyderabad

   స్వామిహ్‌ నిధి కింద బెంగళూరులో తొలి ప్రాజెక్టులో భాగంగా గృహాలు పొందినవారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. కాగా, ఈ ప్రాజెక్టు కింద దాదాపు 3,000 కుటుంబాలు తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకున్నాయి.

దీనిపై దక్షిణ బెంగళూరు ఎంపీ శ్రీ తేజస్వి సూర్య ట్వీట్‌కు ప్రతిస్పందనగా పంపిన సందేశంలో:

“ఈ ప్రాజెక్టు కింద సొంత ఇంటి కల సాకారం చేసుకున్న వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1937196) Visitor Counter : 149