ప్రధాన మంత్రి కార్యాలయం

అమెరికాలోని భారత సంతతి సభ్యులతో ప్రధాని సంభాషణ

Posted On: 24 JUN 2023 7:30AM by PIB Hyderabad

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జూన్ 23న వాషింగ్టన్ డీసీ లోని రోనాల్డ్ రీగన్ సెంటర్ లో భారత సంతతి సభ్యులతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, అమెరికాలో వివిధ రంగాలలో భారత సంతతి ప్రజలు సాధిస్తున్న  విజయాలను అభినందించారు. భారతదేశంలో ప్రస్తుతం సాగుతున్న అమృత కాలంలో దేశ అభివృద్ధికి తమ వంతు సాయం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. భారత్-అమెరికా సంబంధాలను పటిష్టపరచటంలో  వారు పోషిస్తున్న పాత్రకు ప్రధాని ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో ఐ రంగాలలో ద్వైపాక్షిక భాగస్వామ్యాలకు అవకాశం ఉందో వివరించారు.

 

***



(Release ID: 1935027) Visitor Counter : 147