ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

2023-24 మార్కెటింగ్ సీజన్ కి గాను ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలకు కేంద్ర కాబినెట్ ఆమోదం 

Posted On: 07 JUN 2023 2:56PM by PIB Hyderabad

 

 

ప్రధాని అధ్యక్షతన ఈరోజు జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం 2023-2024 మార్కెటింగ్ సీజన్ కు గాను ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలకు ఆమోదం తెలియజేసింది. 

ఖరీఫ్ పంటలకు రైతులకు తమ ఉత్పత్తులకు తగిన ధరలు వచ్చే విధంగానూ, పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించే విధంగానూ ప్రభుత్వం 2023-2024 మార్కెటింగ్ సీజన్ కు కనీస మద్దతు ధరలు పెంచింది. ఆ వివరాలు ఈ క్రింది పట్టికలో ఉన్నాయి: 

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2023-2024 కు కనీస మద్దతు ధర 

(Rs. per quintal)

పంటలు 

 2014-15 కనీస మద్దతు ధర 

 2022-23 కనీస మద్దతు ధర 

2023-24 కనీస మద్దతు ధర 

 ఖర్చు * ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్  2023-24

2022-23 కంటే కనీస మద్దతు ధర పెరుగుదల 

ఖర్చుకంటే అదనం  (శాతంలో) 

వరి - సాధారణ రకం  

1360

2040

2183

1455

143

50

వరి - ఎ గ్రేడ్ 

1400

2060

2203

-

143

-

జొన్న హైబ్రిడ్ 

1530

2970

3180

2120

210

50

జొన్న -మాల్దండి 

1550

2990

3225

-

235

-

సజ్జలు 

1250

2350

2500

1371

150

82

రాగులు 

1550

3578

3846

2564

268

50

మొక్క జొన్నలు 

1310

1962

2090

1394

128

50

కందులు 

4350

6600

7000

4444

400

58

పెసలు 

4600

7755

8558

5705

803

50

మినుములు 

4350

6600

6950

4592

350

51

వేరు శెనగ 

4000

5850

6377

4251

527

50

ప్రొద్దుతిరుగుడు గింజలు 

3750

6400

6760

4505

360

50

సోయాబీన్ ( పసుపు పచ్చ) 

2560

4300

4600

3029

300

52

నువ్వులు 

4600

7830

8635

5755

805

50

నైగర్ విత్తనాలు 

3600

7287

7734

5156

447

50

ప్రత్తి  (మధ్యరకంపింజె )

3750

6080

6620

4411

540

50

ప్రత్తి (పొడవు  పింజె ) ^

4050

6380

7020

-

640

-

 

*చెల్లించిన అన్ని ఖర్చులూ కలుపుకొని ( కూలీలకు చెల్లింపులు, ఎడ్ల దున్నకం /  యంత్రాలతో దున్నకం చెల్లింపు, పొలం కౌలు, విత్తనాలకు, ఎరువులకు, నీటి పారుదలకు, పనిముట్లు, వ్యవసాయ భవనాల తరుగుదల, నిర్వహణ మూలధనానికి వడ్డీ, పంపుసెట్ల నిర్వహణకు డీజిల్/విద్యుత్ ఛార్జీలు తదితరాలు. ) కుటుంబ  సభ్యు;ల శ్రమ ఖర్చు   

^ వారి ( గ్రేడ్ ఎ కు, జొన్న ( మాల్దండి) కి, ప్రత్తి (పొడవి పింజె) కు విడిగా ఖర్చు సమాచారం సేకరించలేదు 

2023-24 ఖరీఫ్ సీజన్ కు కనీస మద్దతు ధర పెంపు 2018-19 బడ్జెట్ లో చేసిన ప్రకటనకు అనుగుణంగా అఖిల భారత స్థాయిలో ఉత్పత్తి వ్యయపు సగటుకు ఒకటిన్నర రెట్లు ఉండేలా జరిగింది. దీనివలన రైతులకు అర్థవంతమైన లాభం ఉంటుందని అంచనావేశారు.  అంచనా వేసిన లాభం అత్యధికంగా జొన్నకు 82% ఉండగా, ఆ తరువాత స్థానంలో ఉన్న కందులకు 58%, సోయాబీన్ కు 52%, మినుములకు 51% ఉంది. మిగిలిన పంటలకు రైతులకు వారి ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50% అధికంగా ఉంది.

ఈ మధ్య కాలంలో ప్రభుత్వం పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాల వంటివి పండించటాన్ని ప్రోత్సహిస్తోంది. అందుకే ఈ పంటలకు అత్యధికంగా కనీస మద్దతు ధర ఇస్తోంది.  ప్రభుత్వం అదనంగా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, జాతీయ ఆహార భద్రతా మిషన్ వంటి చొరవల ద్వారా రైతులు తమ పంటలలో వైవిధ్యం చూపేలా ప్రోత్సహిస్తోంది. 

2022-23 ముందస్తు అంచనాల ప్రకారం దేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 330. 5 మిలియన్ టన్నులు ఉంటుందని లెక్కించారు. ఇది అంతకు ముందు సంవత్సరం 2021-22 కంటే 14.9 మిలియన్ టన్నులు అధికం. ఇది గత అయిదేళ్లలో అత్యధిక పెరుగుదల.  

****



(Release ID: 1930804) Visitor Counter : 7872