ప్రధాన మంత్రి కార్యాలయం

మైసూరు లో మరియు ధన్ బాద్ లో జరిగిన దుర్ఘటన ల కారణం గా ప్రాణనష్టంవాటిల్లడం పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి


పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి పరిహారాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు

Posted On: 29 MAY 2023 8:37PM by PIB Hyderabad

మైసూరు లో మరియు ధన్ బాద్ లో జరిగిన దుర్ఘటన ల కారణం గా ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి పరిహారాన్ని బాధితుల కు ఇవ్వడం జరుగుతుంది అని శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం కొన్ని ట్వీట్ లలో -

‘‘కర్నాటక లోని మైసూరు లో జరిగిన విషాద భరితమైనటువంటి ఘటన ను గురించి తెలిసి ఎంతగానో దుఃఖించాను. ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరిత గతి న పునఃస్వస్థులు కావాలని ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను: ప్రధాన మంత్రి’’

‘‘ధన్ బాద్ లో జరిగిన ఒక దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం సంభవించడం అత్యంత దురదృష్టకరం గా ఉంది. ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల కు ఇదే ప్రగాఢ సంతాపం. గాయపడిన వారు త్వరిత గతి న పునఃస్వస్థులు కావాలని ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను: ప్రధాన మంత్రి’’

‘‘మైసూరు లో మరియు ధన్ బాద్ లో జరిగిన విషాద ఘటనల లో ప్రాణాల ను కోల్పోయిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల వంతు న పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి ప్రకటించారు. ఈ దుర్ఘటనల లో గాయపడిన వారి కి ఒక్కొక్కరి కి 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది.’’ అని తెలిపింది.

***

DS/SH



(Release ID: 1928349) Visitor Counter : 125