ప్రధాన మంత్రి కార్యాలయం
బ్రిటన్ ప్రధానమంత్రితో భారత ప్రధానమంత్రి సమావేశం
Posted On:
21 MAY 2023 8:48AM by PIB Hyderabad
హిరోషిమాలో జి7 దేశాల శిఖరాగ్ర సభ వేదిక వద్ద ఆదివారం బ్రిటన్ ప్రధానమంత్రి శ్రీ రిషి సునాక్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సమావేశమయ్యారు.
ఇండియా - బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలలో ప్రగతితో సహా రెండు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి ఇద్దరు నేతలు సమీక్షించారు.
వాణిజ్యం & పెట్టుబడులు, శాస్త్ర సాంకేతిక రంగం, ఉన్నత విద్య మరియు రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలతో పాటు వివిధ రంగాలలో సహకారాన్ని మరింత పెంచాలని వారిద్దరూ అంగీకరించారు.
జీ20 అధ్యక్ష హోదా గురించి కూడా చర్చలు జరిపారు. న్యూఢిల్లీలో జరిగే జి-20 సభకు సునాక్ వస్తారని ఆశిస్తున్నట్లు, తన రాకకై ఎదురుచూస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు.
***
(Release ID: 1926127)
Visitor Counter : 190
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam