ప్రధాన మంత్రి కార్యాలయం

బ్రిటన్ ప్రధానమంత్రితో భారత ప్రధానమంత్రి సమావేశం

Posted On: 21 MAY 2023 8:48AM by PIB Hyderabad

హిరోషిమాలో  జి7 దేశాల శిఖరాగ్ర సభ వేదిక వద్ద  ఆదివారం  బ్రిటన్ ప్రధానమంత్రి శ్రీ రిషి సునాక్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సమావేశమయ్యారు.  

ఇండియా - బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలలో ప్రగతితో సహా రెండు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి ఇద్దరు నేతలు సమీక్షించారు.

వాణిజ్యం & పెట్టుబడులు, శాస్త్ర సాంకేతిక రంగం, ఉన్నత విద్య మరియు రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలతో పాటు వివిధ  రంగాలలో సహకారాన్ని మరింత పెంచాలని వారిద్దరూ అంగీకరించారు.  

జీ20 అధ్యక్ష హోదా గురించి కూడా చర్చలు జరిపారు.   న్యూఢిల్లీలో జరిగే జి-20 సభకు సునాక్ వస్తారని ఆశిస్తున్నట్లు, తన రాకకై ఎదురుచూస్తున్నట్లు  ప్రధానమంత్రి తెలిపారు.  

 

***
 



(Release ID: 1926127) Visitor Counter : 151