ప్రధాన మంత్రి కార్యాలయం

ఢిల్లీలోనిజాతీయ ఆధునిక చిత్రకళా ప్రదర్శన శాలలోజనశక్తి చిత్రకళా ప్రదర్శననుతిలకించిన ప్రధానమంత్రి


ప్రదర్శన ముఖ్యాంశాలను ప్రజలతోపంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 14 MAY 2023 2:41PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలోని జాతీయ ఆధునిక చిత్రకళా ప్రదర్శనశాలలో ఏర్పాటు చేసిన జనశక్తి చిత్రకళా ప్రదర్శనను తిలకించారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమం సంబంధిత కొన్ని ఇతివృత్తాల ఆధారంగా చిత్రించిన అద్భుత కళాఖండాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు.

దీనిపై ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్‌’లో జనశక్తి చిత్రకళా ప్రదర్శనను తిలకించాను. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలోని కొన్ని ఇతివృత్తాల ఆధారంగా అద్భుతంగా చిత్రించిన కళాఖండాలతో ఈ ప్రదర్శన నిర్వహించారు. తమ సృజనాత్మకతతో ఈ ప్రదర్శనను సుసంపన్నం చేసిన కళాకారులందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

అలాగే- “ఢిల్లీలోని నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడరన్‌ ఆర్ట్‌’లో నిర్వహించిన జనశక్తి చిత్రకళా ప్రదర్శనలోని కొన్ని కళాఖండాల విశేషాలను మీతో పంచుకుంటున్నాను” అని పేర్కొన్నారు.

 

 

For more details:  https://pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=1924012

 

***


DS/TS



(Release ID: 1924116) Visitor Counter : 136