ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ కేశుభ్‌ మహింద్ర మృతిపై ప్రధానమంత్రి సంతాపం

Posted On: 12 APR 2023 7:57PM by PIB Hyderabad

   ప్రసిద్ధ వ్యాపారవేత్త  శ్రీ కేశుభ్‌ మహింద్ర కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

“శ్రీ కేశుభ్‌ మహింద్ర తుదిశ్వాస విడిచారన్న వార్త నన్ను ఆవేదనకు గురిచేసింది. వ్యాపార ప్రపంచంలో అవిరళ కృషి, వితరణశీలత ఆయనను చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలుపుతాయి. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. ఓం శాంతిః PM @narendramodi” అని పేర్కొంది.



(Release ID: 1916071) Visitor Counter : 152