ప్రధాన మంత్రి కార్యాలయం
బీచ్ల అభివృద్ధి.. పరిశుభ్రత దిశగా దియ్యూకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చిన కీలక ట్వీట్ను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
Posted On:
07 APR 2023 11:17AM by PIB Hyderabad
దేశంలో బీచ్ల అభివృద్ధి, పరిశుభ్రతకు సంబంధించి దియ్యూకు ప్రత్యేక ప్రాధాన్యంతో వెలువడిన కీలక ట్వీట్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు ‘బ్లూ ఫ్లాగ్’ ధ్రువీకరణ పొందిన బీచ్ల గురించి దమన్-దియ్యూ పార్లమెంటు సభ్యుడు శ్రీ లాలూభాయ్ పటేల్ ట్వీట్ను ప్రజలతో పంచుకుంటూ పంపిన సందేశంలో:
“అద్భుతమైన తీరప్రాంతం, బీచ్లకు దియ్యూ నిలయంగా ఉంది. తీరప్రాంత పరిశుభ్రత, అభివృద్ధికి సంబంధించి దియ్యూపై ప్రత్యేక ప్రస్తావనతో వెలువడిన ఈ ట్వీట్ కీలకమైనది. సమష్టి కృషి అందరి ఆలోచనల్లోనూ మార్పునకు దారితీసి యావత్ సమాజానికి ఎలా ప్రయోజనం కల్పిస్తుందో ఇది స్పష్టం చేస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/TS
(Release ID: 1914669)
Visitor Counter : 199
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam