ప్రధాన మంత్రి కార్యాలయం

బీచ్‌ల అభివృద్ధి.. పరిశుభ్రత దిశగా దియ్యూకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చిన కీలక ట్వీట్‌ను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 07 APR 2023 11:17AM by PIB Hyderabad

   దేశంలో బీచ్‌ల అభివృద్ధి, పరిశుభ్రతకు సంబంధించి దియ్యూకు ప్రత్యేక ప్రాధాన్యంతో వెలువడిన కీలక ట్వీట్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

ఈ మేరకు ‘బ్లూ ఫ్లాగ్‌’ ధ్రువీకరణ పొందిన బీచ్‌ల గురించి దమన్-దియ్యూ పార్లమెంటు సభ్యుడు శ్రీ లాలూభాయ్ పటేల్ ట్వీట్‌ను ప్రజలతో పంచుకుంటూ పంపిన సందేశంలో:

“అద్భుతమైన తీరప్రాంతం, బీచ్‌లకు దియ్యూ నిలయంగా ఉంది. తీరప్రాంత పరిశుభ్రత, అభివృద్ధికి సంబంధించి దియ్యూపై ప్రత్యేక ప్రస్తావనతో వెలువడిన ఈ ట్వీట్‌ కీలకమైనది. సమష్టి కృషి అందరి ఆలోచనల్లోనూ మార్పునకు దారితీసి యావత్‌ సమాజానికి ఎలా ప్రయోజనం కల్పిస్తుందో ఇది స్పష్టం చేస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


***


DS/TS



(Release ID: 1914669) Visitor Counter : 159