ప్రధాన మంత్రి కార్యాలయం

ఉత్తర్ ప్రదేశ్ లోని చందౌసిలో శీతలీకరణ గిడ్డంగి ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం

Posted On: 17 MAR 2023 8:02PM by PIB Hyderabad

ఉత్తర్ ప్రదేశ్  లోని చందౌసిలో శీతలీకరణ గిడ్డంగిలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

ప్రధానమంత్రి కార్యాలయం ఈ మేరకు ట్వీట్ చేస్తూ  

‘‘ఉత్తర్  ప్రదేశ్  లోని చందౌసి శీతలీకరణ గిడ్డంగిలో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరం. ఆ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. బాధితుల సహాయ, పునరావాసం కోసం స్థానిక యంత్రాంగం రాష్ర్ట ప్రభుత్వ పర్యవేక్షణలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను : ప్రధానమంత్రి’’ అని పేర్కొంది

*************

DS/SH



(Release ID: 1908297) Visitor Counter : 112