ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య మౌలిక వసతుల మెరుగుదల అత్యంత సంతృప్తికరం : ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 06 MAR 2023 8:24PM by PIB Hyderabad

దేశంలోను ప్రత్యేకించి మారుమూల ప్రాంతాల్లోను ఆరోగ్య మౌలిక వసతులు ఎంతగానో అభివృద్ధి చెందడం  పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం ప్రకటించారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేవగఢ్  లో ఎయిమ్స్ ప్రారంభించడంతో ఆరోగ్య సంరక్షణ రంగంలో విప్లవం ఏర్పడిందంటూ జార్ఖండ్ లోని గొడ్డ నియోజకవర్గం ఎంపి డాక్టర్ నిశికాంత్ దూబే చేసిన ట్వీట్ కు శ్రీ మోదీ స్పందిస్తూ

‘‘నేడు జరుగనున్న వెబినార్ లో ఆరోగ్య రంగంలో ఏర్పడిన ప్రగతి గురించి నేను మాట్లాడతాను. దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఆరోగ్య మౌలిక వసతులు విస్తరించడం చూసి ఆనందం కలుగుతోంది’’ అన్నారు. 


(రిలీజ్ ఐడి: 1904801) సందర్శకుల సూచీ సంఖ్య : : 232