ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

త్రిపుర రాష్ట్రావతరణ సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 21 JAN 2023 10:02AM by PIB Hyderabad

    త్రిపుర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో త్రిపుర ప్రజలకు శుభాకాంక్షలు. గడచిన ఐదేళ్ల కాలం రాష్ట్ర అభివృద్ధి పథంలో అద్భుతమైన కాలం. వ్యవసాయం నుంచి పరిశ్రమల దాకా, విద్య నుంచి ఆరోగ్యం వరకూ అనేక రంగాల్లో రాష్ట్రం గొప్ప మార్పును సాధించింది. భవిష్యత్తులోనూ ఇదే ధోరణి కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.

***

DS/SH


(రిలీజ్ ఐడి: 1892681) సందర్శకుల సూచీ సంఖ్య : : 261