ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

ఎస్ జెవిఎన్ ద్వారా హిమాచల్ ప్రదేశ్ లో382 మెగావాట్ సామర్థ్యం కలిగిన సున్నీ డ్యామ్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు కోసం  పెట్టుబడి కి ఆమోదం

Posted On: 04 JAN 2023 4:04PM by PIB Hyderabad

ఎస్ జెవిఎన్ లిమిటెడ్ ద్వారా 2614.51 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో హిమాచల్ ప్రదేశ్ లో 382 మెగావాట్ సామర్థ్యాన్ని కలిగి ఉండే సున్నీ డ్యామ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గం సంఘం (సిసిఇఎ) సమావేవం తన ఆమోదాన్ని ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కు అంచనా వ్యయం. దీని లో మౌలిక సదుపాయాల ను తీర్చిదిద్దడానికి భారత ప్రభుత్వం బడ్జెటుపరంగా సహాయం రూపం లో 13.80 కోట్ల రూపాయల ను పెట్టుబడి పెట్టేందుకు కూడా స్వీకృతిని ఇవ్వడమైంది. 2022వ సంవత్సరం జనవరి వరకు మొత్తం 246 కోట్ల రూపాయల సంచిత వ్యయాని కి గాను ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని సైతం ఇవ్వడం జరిగింది.

 

ప్రాజెక్టు వ్యయం 2614 కోట్ల రూపాయలు కాగా, అందులో 2246.40 కోట్ల రూపాయల వాస్తవిక వ్యయం, నిర్మాణం కాలం లో వడ్డీ (ఐడిసి) పద్దు రూపం లో 358.96 కోట్ల రూపాయలు మరియు ఆర్థిక సహాయ సంబంధి ఖర్చు లు (ఎఫ్ సి) మరో 9.15 కోట్ల రూపాయలు కూడా కలిసి ఉన్నాయి. రాశి సంబంధి పరివర్తన (జోడించడం/ మార్పు లు/ అదనపు వస్తువులు సహా) కారణం గా భిన్న వ్యయం లో తేడాల కై సవరించిన వ్యయ మంజూరు లు మరియు డెవలపర్ కు సూచించిన కాలావధి స్వీకృత వ్యయం లో 10 శాతాని కి పరిమితమవుతుంది.

 

ఆత్మనిర్భర్ భారత్ అభియాన్యొక్క లక్ష్యాల ను మరియు ఉద్దేశ్యాల ను దృష్టి లో పెట్టుకొని, ఎస్ జెవిఎన్ ద్వారా 382 మెగా వాట్ ల సున్నీ డ్యామ్ హెచ్ ఇపి ని ఏర్పాటు చేయడం కోసం వర్తమాన ప్రతిపాదన ద్వారా స్థానిక సరఫరాదారుల కు/స్థానిక వాణిజ్య సంస్థల కు/ఎమ్ఎస్ఎమ్ ఇ లకు వివిధ ప్రయోజనాలను అందించనుంది. దేశం లో ఉపాధి అవకాశాల ను ప్రోత్సహిస్తూ, ఆ ప్రాంతం లో సామాజిక, ఆర్థిక అభివృద్ధి కి పూచీ పడనుంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చే క్రమం లో దీని నిర్మాణం తాలూకు చరమ దశ లో దాదాపు గా 4,000 మంది కి ప్రత్యక్ష ఉపాధి మరియు పరోక్ష ఉపాధి అవకాశాలు అందిరాగలవు.

 

**



(Release ID: 1888624) Visitor Counter : 190