ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అనుభవజ్ఞ‌ురాలైన ప్రభుత్వాధికారిణి డాక్టర్ మంజుల సుబ్రమణ్యమ్ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 01 JAN 2023 9:34PM by PIB Hyderabad

అనుభవజ్ఞ‌ురాలైన ప్రభుత్వాధికారిణి డాక్టర్ మంజుల సుబ్రమణ్యమ్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘చిరకాల అనుభవం కలిగినటువంటి ప్రభుత్వాధికారిణి డాక్టర్ మంజుల సుబ్రమణ్యమ్ గారు ఇక లేరన్న వార్త తెలిసి దుఃఖిస్తున్నాను. విధాన నిర్ణయాల కు సంబంధించినటువంటి అంశాల లో ఆమె కు ఉన్న అవగాహన కు మరియు కార్యాచరణ కు ప్రాధాన్యాన్ని ఇచ్చేటటువంటి ఆమె వైఖరి కి గాను ఆమె ను అంతా గౌరవించే వారు. నేను ముఖ్యమంత్రి పదవి లో ఉన్న కాలం లో, ఆమె తో జరిపిన మాటామంతీ నాకు జ్ఞ‌ా పకం ఉంది. ఆమె కుటుంబాని కి మరియు ఆమె మిత్రుల కు ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

*****

DS/ST

 

 

 


(రిలీజ్ ఐడి: 1887994) సందర్శకుల సూచీ సంఖ్య : : 351