ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

పార్లమెంటు లో మధ్యాహ్న భోజనం కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రిమరియు ఇతర నేతలు; చిరుధాన్యాల తో వండిన వంటకాల ను ఈ సందర్భం లో వడ్డించడమైంది

Posted On: 20 DEC 2022 6:04PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో పాటు ఇతర నేతలు పార్లమెంటు లో మధ్యాహ్న భోజనం కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు. భారతదేశం 2023వ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం గా జరుపుకోవడానికి సన్నద్ధం అవుతున్న తరుణం లో చిరుధాన్యాల తో వండినటువంటి ఆహారాన్ని ఈ సందర్భం లో వడ్డించడం జరిగింది.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మనం 2023వ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం గా పాటించడానికి సన్నద్ధం అవుతున్న తరుణం లో, పార్లమెంటు లో ఒక చక్కటి భోజన కార్యక్రమం లో పాలుపంచుకొన్నాను. ఈ సందర్భం లో చిరుధాన్యాల తో వండిన వంటకాల ను వడ్డించడం జరిగింది. పార్టీ విబేధాల కు అతీతం గా పలువురు ఈ కార్యక్రమం లో పాల్గొనడం బాగుంది.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH



(Release ID: 1885260) Visitor Counter : 129