ప్రధాన మంత్రి కార్యాలయం

ఇండియా-స్వీడన్ వర్చువల్ సమ్మిట్‌లో ప్రధానమంత్రి ప్రారంభ వ్యాఖ్యలు

Posted On: 05 MAR 2021 1:16PM by PIB Hyderabad

 

నమస్కారం శ్రేష్ఠులారా!

 

మొట్టమొదటగా, కోవిడ్-19 వల్ల స్వీడన్ లో ప్రాణనష్టం జరిగినందుకు నా తరఫున, యావత్ భారతదేశం తరఫున నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. మొన్న స్వీడన్ లో జరిగిన హింసాత్మక దాడులకు భారతీయ పౌరులందరి తరఫున స్వీడన్ ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నాను. దాడిలో గాయపడిన వ్యక్తులు త్వరగా కోలుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము.

ఎక్సెలెన్సీ,

స్వీడన్ 2018లో ఇండియా-నార్డిక్ మొట్టమొదటి శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది. ఆ సమయంలో, స్టాక్‌హోమ్‌ని సందర్శించే అవకాశం నాకు లభించింది. త్వరలో ఇండియా-నార్డిక్ రెండో సమ్మిట్ సందర్భంగా మళ్లీ కలిసే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నాను. హిజ్ మెజెస్టి ది కింగ్ మరియు హర్ మెజెస్టి 2019లో భారతదేశం సందర్శించడం మాకు గొప్ప అవకాశం. చాలా విషయాలపై వారితో చాలా బాగా చర్చించాను. పవర్ ప్లాంట్లలో ఉపయోగించడం కొరకు పంట వ్యర్థాలను బ్రికెట్ లుగా మార్చడంలో సహకారాన్ని హిజ్ మెజెస్టీ మరియు నేను సమీక్షించడం నాకు గుర్తుంది. డెమానిస్ట్రేషన్ ప్లాంట్ బాగా పనిచేస్తోందని తెలిస్తే మీరు సంతోషిస్తారు. ఇప్పుడు మనం బయోమాస్ ను బొగ్గుగా మార్చడానికి దానిని స్కేల్ చేయవచ్చు.

ఎక్సెలెన్సీ,

 

కోవిడ్-19 సమయంలో, ప్రాంతీయ మరియు ప్రపంచ స్థాయిలలో సహకారం యొక్క ప్రాముఖ్యతను మేము గుర్తించాము. కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భారతదేశం 150 కి పైగా దేశాలకు మందులు మరియు ఇతర అవసరమైన పరికరాలను అందించడం ద్వారా ప్రపంచానికి సహాయం చేసింది. ఆన్ లైన్ ట్రైనింగ్ కార్యక్రమాల ద్వారా ఆసియా, ఆగ్నేయాసియా మరియు ఆఫ్రికాకు చెందిన ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్ లు మరియు పాలసీ రూపకర్తలతో మా అనుభవాలను పంచుకున్నాం. మేము ఇప్పటివరకు 50 దేశాలకు 'మేడ్ ఇన్ ఇండియా' వ్యాక్సిన్లను కూడా పంపిణీ చేసాము. రాబోయే రోజుల్లో మరిన్ని దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము.

ఎక్సెలెన్సీ,

 

భావసారూప్యత కలిగిన దేశాలన్నింటి మధ్య సమన్వయం, సహకారం, సహకారం నేటి వాతావరణంలో మరింత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ప్రజాస్వామ్యం, మానవహక్కులు, చట్టపాలన, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి భాగస్వామ్య విలువలు మన సంబంధాలను, పరస్పర సహకారాన్ని బలపరుస్తాయి. వాతావరణ మార్పుల యొక్క కీలకమైన సమస్య మా ఇద్దరికీ ఒక ప్రాధాన్యత మరియు మేము దీనిపై ఉమ్మడిగా పని చేయాలనుకుంటున్నాము. భారతీయ సంస్కృతిలో, పర్యావరణ పరిరక్షణ మరియు ప్రకృతితో సామరస్యంగా జీవించడానికి ఎల్లప్పుడూ ప్రాముఖ్యత ఇవ్వబడింది.

పారిస్ ఒప్పందంలో మా వాగ్ధానాలపై మేము స్థిరంగా ముందుకు సాగుతున్నాము. మేము ఈ లక్ష్యాలను సాధించడమే కాకుండా, వాటిని అధిగమిస్తాము. జి 20 దేశాలలో, బహుశా భారతదేశం మాత్రమే తన కట్టుబాట్లపై మంచి పురోగతి సాధించగలిగింది. మన పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గత ఐదేళ్లలో 162% పెరిగింది. 2030 నాటికి 450  గిగావాట్ల పునరుత్పాదక శక్తిని స్థాపించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఎల్ ఈడీ లైట్ల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా 30 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను ఆదా చేస్తున్నాం. అంతర్జాతీయ సోలార్ కూటమిలో చేరుతున్న స్వీడన్ ప్రకటనను మేం స్వాగతిస్తున్నాం. త్వరలో విపత్తును తట్టుకునే మౌలిక సదుపాయాల కూటమిలో చేరమని కూడా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

ఎక్సెలెన్సీ,

 

కోవిడ్ అనంతర స్థిరీకరణ మరియు రికవరీలో భారతదేశం-స్వీడన్ భాగస్వామ్యం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులు, స్టార్టప్ లు మరియు పరిశోధన రంగాలలో పరస్పర సహకారాన్ని మరింతగా మరింత గాఢం చేసుకోవచ్చు. స్మార్ట్ సిటీలు, వాటర్ ట్రీట్ మెంట్, వేస్ట్ మేనేజ్ మెంట్, సర్క్యులర్ ఎకానమీ, స్మార్ట్ గ్రిడ్స్, ఈ-మొబిలిటీ, డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ మొదలైనవి కూడా పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి మంచి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ రోజు మా వర్చువల్ సమ్మిట్ మా సహకారానికి కొత్త కోణాలను జోడిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.

ఎక్సెలెన్సీ,

 

స్వీడన్ పౌరులతో భారత దేశ గొప్ప స్నేహం మన ఉమ్మడి ప్రయాణాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ, ఇప్పుడు మీ ప్రారంభ ప్రసంగాలకు నేను మిమ్మల్ని ఆహ్వానించాలనుకుంటున్నాను.



(Release ID: 1871133) Visitor Counter : 89