ప్రధాన మంత్రి కార్యాలయం
మహిళల ఏశియా కప్ ను గెలుచుకొన్నందుకు భారతీయ మహిళల క్రికెట్ జట్టు నుఅభినందించిన ప్రధాన మంత్రి
Posted On:
15 OCT 2022 6:24PM by PIB Hyderabad
మహిళల ఏడో ఏశియా కప్ ను గెలుచుకొన్నందుకు భారతీయ మహిళల క్రికెట్ జట్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఇంటర్ నేశనల్ క్రికెట్ కౌన్సిల్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి జవాబిస్తూ, అందులో -
‘‘మన మహిళల క్రికెట్ జట్టు వారి యొక్క ధైర్యం తో మరియు నైపుణ్యం తో మనం గర్వపడేటట్టు చేసింది. మహిళల ఏశియా కప్ ను గెలుచుకొన్నందుకు గాను జట్టు కు ఇవే అభినందన లు. వారు ఉత్కృష్ట కౌశలాన్ని మరియు సంఘటిత శ్రమ ను చాటారు. క్రీడాకారిణులు వారి భావి ప్రయాసల లోనూ రాణించాలని కోరుకొంటూ శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1868309)
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam