ప్రధాన మంత్రి కార్యాలయం

రాజమాత విజయ రాజే సింధియా గారికి ఆమె జయంతి నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 12 OCT 2022 9:07AM by PIB Hyderabad

రాజమాత విజయ రాజే సింధియా జీ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు శ్రద్ధాంజలి ఘటించారు. రాజమాత విజయ రాజే సింధియా గారు ధైర్య, సాహసాలకు మరియు ముందుచూపునకు మారుపేరు గా నిలచారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘రాజమాత విజయ రాజే సింధియా జీ జయంతి సందర్భం లో ఆమె కు ఇదే శ్రద్ధాంజలి. ఆమె ధైర్య, సాహసాలకు మరియు ముందుచూపునకు మారుపేరు గా నిలచారు. ఇతరులకు సేవ చేయడం కోసం ఆవిడ తన జీవితాన్ని అంకితం చేశారు. ఆమె యొక్క అసాధారణమయినటువంటి వ్యక్తిత్వాన్ని గురించి ఇదివరకటి #MannKiBaat (‘మనసులో మాట’) కార్యక్రమాల లో భాగం అయిన ఒక కార్యక్రమం లో నేను ఏమి మాట్లాడిందీ ఇక్కడ శేర్ చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 



(Release ID: 1867057) Visitor Counter : 104