ప్రధాన మంత్రి కార్యాలయం

జ్ఞాపికల వేలం 12దాకా పొడిగింపు

Posted On: 07 OCT 2022 10:24PM by PIB Hyderabad

   ప్రధాని జ్ఞాపికల వేలం-2022ను ఈ నెల 12వ తేదీ వరకూ పొడిగించినట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ట్వీట్‌పై స్పందన ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

   “కొన్ని సంవత్సరాలుగా నేను అందుకున్న అనేక ప్రత్యేక బహుమతులలో ఇదీ ఒకటి. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ జ్ఞాపికల వేలం 12వ తేదీ వరకు పొడిగించబడింది. మీరందరూ పాల్గొనండి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*****

DS



(Release ID: 1866095) Visitor Counter : 125