ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తర్ ప్రదేశ్ లోని లఖీమ్ పుర్ ఖేరీ లో జరిగిన ప్ర‌మాదం లో ప్రాణ‌న‌ష్టం వాటిల్ల‌డం ప‌ట్ల విచారం వ్యక్తం చేసిన ప్ర‌ధాన మంత్రి


బాధితులకు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్ని కూడా ఆయన ప్రకటించారు

Posted On: 28 SEP 2022 2:41PM by PIB Hyderabad

ఉత్తర్ ప్రదేశ్ లోని లఖీమ్ పుర్ ఖేరీ జిల్లా లో జరిగిన ప్రమాదం కారణం గా ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం లో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

బాధితుల కు పరిహారాన్ని ప్రధాన మంత్రి ప్రకటించారు. ఈ దుర్ఘటన లో ప్రాణాలను కోల్పోయినవారి దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయలు, ప్రమాదం లో గాయపడ్డవారికి 50,000 రూపాయల వంతున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి అందజేయడం జరుగుతుంది.

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) ఒక ట్వీట్ లో –

‘‘ఉత్తర్ ప్రదేశ్ లోని లఖీమ్ పుర్ ఖేరీ లో జరిగిన ప్రమాద ఘటనపై దుఃఖించాను. మృతుల కుటుంబాల కు నా సానుభూతి ని తెలియజేస్తున్నాను. గాయపడిన వారంతా త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ దుర్ఘటన లో ప్రాణాలను కోల్పోయినవారి దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రమాదం లో గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున అందజేయడం జరుగుతుంది: ప్రధాన మంత్రి @narendramodi’’ అని పేర్కొంది.

*****

DS/ST

 


(Release ID: 1862926)