ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తర్ ప్రదేశ్ లోని లఖీమ్ పుర్ ఖేరీ లో జరిగిన ప్రమాదం లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
బాధితులకు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్ని కూడా ఆయన ప్రకటించారు
Posted On:
28 SEP 2022 2:41PM by PIB Hyderabad
ఉత్తర్ ప్రదేశ్ లోని లఖీమ్ పుర్ ఖేరీ జిల్లా లో జరిగిన ప్రమాదం కారణం గా ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం లో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
బాధితుల కు పరిహారాన్ని ప్రధాన మంత్రి ప్రకటించారు. ఈ దుర్ఘటన లో ప్రాణాలను కోల్పోయినవారి దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయలు, ప్రమాదం లో గాయపడ్డవారికి 50,000 రూపాయల వంతున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి అందజేయడం జరుగుతుంది.
ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) ఒక ట్వీట్ లో –
‘‘ఉత్తర్ ప్రదేశ్ లోని లఖీమ్ పుర్ ఖేరీ లో జరిగిన ప్రమాద ఘటనపై దుఃఖించాను. మృతుల కుటుంబాల కు నా సానుభూతి ని తెలియజేస్తున్నాను. గాయపడిన వారంతా త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ దుర్ఘటన లో ప్రాణాలను కోల్పోయినవారి దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రమాదం లో గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున అందజేయడం జరుగుతుంది: ప్రధాన మంత్రి @narendramodi’’ అని పేర్కొంది.
*****
DS/ST
(Release ID: 1862926)
Visitor Counter : 121
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam