ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎథ్లెటిక్స్ మెన్స్ ట్రిపుల్ జంప్ లో బంగారు పతకాన్ని సాధించినందుకు శ్రీ ఎల్ధోస్పాల్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 07 AUG 2022 6:04PM by PIB Hyderabad

బర్మింగ్ హమ్ లో జరుగుతున్నటువంటి కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో ఎథ్ లెటిక్స్ మెన్స్ ట్రిపుల్ జంప్ లో పసిడి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ ఎల్ధోస్ పాల్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఈ రోజు న జరిగిన ట్రిపుల్ జంప్ పోటీ చరిత్రాత్మకమైంది గా ఉంది. మన క్రీడాకారులు భలే గా రాణించారు. శ్రేష్ఠమైన ప్రతిభావంతుడు శ్రీ ఎల్ధోస్ పాల్ స్వర్ణ పతకాన్ని గెలిచి, ఇంతకు ముందు అంతర్జాతీయ పోటీల లో తాను కనబరచినటువంటి చక్కనైన ప్రదర్శన కు మెరుగు పెట్టుకొన్నారు. ఆయన కు ఇవే అభినందన లు. ఆయన సమర్పణభావం హర్షణీయం. #Cheer4India’’ అని పేర్కొన్నారు.

 

 


(Release ID: 1849563) Visitor Counter : 144