ప్రధాన మంత్రి కార్యాలయం

బాక్సింగ్‌లో కాంస్య పతకం సాధించిన రోహిత్‌ టోకాస్‌కు ప్రధానమంత్రి అభినందనలు

Posted On: 07 AUG 2022 8:23AM by PIB Hyderabad

   బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022 పురుషుల బాక్సింగ్‌ 67కిలోల విభాగంలో కాంస్య తకం సాధించిన రోహిత్‌ టోకాస్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా పంపిన సందేశంలో;

   “రోహిత్‌ టోకాస్‌ సాధించిన విజయం నాకెంతో సంతోషం కలిగించింది. బాక్సింగ్‌లో ఆయన కాంస్య పతకం సాధించడంపై అభినందనలు తెలుపుతున్నాను. ఆయన కఠోర శ్రమ, పట్టుదల సత్ఫలితాలిచ్చాయి. భవిష్యత్తులోనూ ఆయన మరిన్ని విజయాలు అందుకోగలరని నేను ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు.



(Release ID: 1849553) Visitor Counter : 125