ప్రధాన మంత్రి కార్యాలయం
బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్-2022 మహిళల కుస్తీ 68 కిలోల విభాగంలో కాంస్య పతక విజేత దివ్యకు ప్రధానమంత్రి అభినందనలు
Posted On:
06 AUG 2022 12:15AM by PIB Hyderabad
బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022 మహిళల కుస్తీ 68 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించిన క్రీడాకారణి దివ్యకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ఈ మేరకు ట్విట్టర్ ద్వారా పంపిన సందేశంలో;
“భారత కుస్తీ క్రీడాకారులకు తిరుగులేదని ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. మహిళల విభాగంలో మన దివ్య కాంస్య పతకం గెలుచుకోవడం నాకెంతో గర్వంగా ఉంది. రాబోయ తరాలకూ ఈ విజయం స్ఫూర్తిదాయకం. భవిష్యత్తులోనూ ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
*****
DS/ST
(Release ID: 1849094)
Visitor Counter : 114
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam