ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బర్మింగ్ హమ్ లో 2022 కామన్ వెల్త్ క్రీడలు ఆరంభం అయిన సందర్భం లో భారతదేశందళాని కి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాన మంత్రి  

నాడు పోస్టు చేయడమైనది: 28 JUL 2022 11:02PM by PIB Hyderabad

బర్మింగ్ హమ్ లో 2022 కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) మొదలైన సందర్భం లో, ఆ క్రీడల లో భారతదేశం పక్షాన పాల్గొంటున్న క్రీడాకారుల కు మరియు క్రీడాకారిణుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘బర్మింగ్ హమ్ లో 2022 కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) ఆరంభం అవుతున్న వేళ, ఆ క్రీడల లో భారతదేశం పక్షాన పాలుపంచుకొంటున్న క్రీడాకారుల కు/ క్రీడాకారిణుల కు ఇవే శుభాకాంక్ష లు. మన ఎథ్ లీట్ లు వారి అతి ఉత్తమమైన ప్రదర్శన ను చాటుతారని, మరి వారి బ్రహ్మాండమైనటువంటి క్రీడా ప్రదర్శన ద్వారా భారతదేశ ప్రజల కు ప్రేరణ ను అందించడాన్ని కొనసాగిస్తారని నేను నమ్ముతున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 


(రిలీజ్ ఐడి: 1846164) సందర్శకుల సూచీ సంఖ్య : : 160