ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో ఇండోనేశియా అధ్యక్షుని తో సమావేశమైన ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోదీ

प्रविष्टि तिथि: 27 JUN 2022 9:22PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండోనేశియా అధ్య‌క్షుడు శ్రీ జోకో విడోడో తో జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో 2022వ సంవత్సరం జూన్ 27 న జర్మనీ లోని శ్లాస్ ఎల్మౌ లో సమావేశమయ్యారు.

ఇండోనేశియా ప్రస్తుతం జి-20 కి అధ్యక్ష బాధ్యతల ను నిర్వర్తిస్తున్నందుకు గాను అధ్యక్షుడు శ్రీ జోకో విడోడో కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు. ఇదే సందర్బం లో భారతదేశం త్వరలో జి-20 కి అధ్యక్ష బాధ్యతల ను స్వీకరించనున్న అంశం పైన కూడా చర్చలు చోటు చేసుకొన్నాయి.

పరస్పర హితం ముడిపడి ఉన్నటువంటి ప్రపంచ అంశాల పైన మరియు ప్రాంతీయ అంశాల పైన సైతం వారు వారి యొక్క అభిప్రాయాల ను ఒకరి కి మరొకరు వెల్లడి చేసుకొన్నారు.

**


(रिलीज़ आईडी: 1837596) आगंतुक पटल : 184
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Gujarati , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam