ప్రధాన మంత్రి కార్యాలయం
జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో ఇండోనేశియా అధ్యక్షుని తో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
నాడు పోస్టు చేయడమైనది:
27 JUN 2022 9:22PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండోనేశియా అధ్యక్షుడు శ్రీ జోకో విడోడో తో జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో 2022వ సంవత్సరం జూన్ 27 న జర్మనీ లోని శ్లాస్ ఎల్మౌ లో సమావేశమయ్యారు.
ఇండోనేశియా ప్రస్తుతం జి-20 కి అధ్యక్ష బాధ్యతల ను నిర్వర్తిస్తున్నందుకు గాను అధ్యక్షుడు శ్రీ జోకో విడోడో కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు. ఇదే సందర్బం లో భారతదేశం త్వరలో జి-20 కి అధ్యక్ష బాధ్యతల ను స్వీకరించనున్న అంశం పైన కూడా చర్చలు చోటు చేసుకొన్నాయి.
పరస్పర హితం ముడిపడి ఉన్నటువంటి ప్రపంచ అంశాల పైన మరియు ప్రాంతీయ అంశాల పైన సైతం వారు వారి యొక్క అభిప్రాయాల ను ఒకరి కి మరొకరు వెల్లడి చేసుకొన్నారు.
**
(రిలీజ్ ఐడి: 1837596)
సందర్శకుల సూచీ సంఖ్య : : 168
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Gujarati
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam