ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి 27,000 కోట్ల రూపాయల పైచిలుకు విలువ కలిగిన అనేక రైలు మరియురోడ్డు లకు సంబంధించిన మౌలిక సదుపాయాల పథకాల ను బెంగళూరు లో ప్రారంభించారు/శంకుస్థాపనచేశారు


బెంగళూరు శివారు రైలు పథకం, బెంగళూరు కంటోన్మెంట్ మరియు యశ్వంత్ పుర్ జంక్షన్  రైల్ వే స్టేశన్ లపునరభివృద్ధి, బెంగళూరు రింగు రోడ్డు ప్రాజెక్టు లో రెండు సెక్షన్లు,  బెంగళూరు లో వివిధ రహదారుల ఉన్నతీకరణపథకాల కు మరియు మల్టిమోడల్ లాజిస్టిక్స్ పార్కు కు శంకుస్థాపన లు 

భారతదేశం లో మొట్టమొదటి ఎయర్ కండిశన్ సదుపాయం కలిగిన రైల్ వే స్టేశన్ , కొంకణ్ రైల్ వే లైను లో 100 శాతం విద్యుదీకరణ ప్రాజెక్టు లతో పాటు, ఇతర రైల్ వే ప్రాజెక్టుల ను దేశ ప్రజలకు ప్రధాన మంత్రి అంకితం చేశారు

‘‘దేశం లో లక్షల కొద్దీ యువతీయువకుల కు కల ల నగరం గా బెంగళూరు ఉంది;  ఈ నగరం ‘ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్ ’ భావన కు అద్దం పడుతోంది’’

‘‘బెంగళూరు ప్రజల కు జీవన సౌలభ్యాన్ని పెంపొందింపచేయడానికి ‘డబల్ ఇంజన్’ ప్రభుత్వం సాధ్యమైన అన్ని విధాలు గానుపాటుపడుతోంది’’

‘‘రైలు సంధానం రూపురేఖల ను సంపూర్ణం గా మార్చివేయడం కోసం గత 8 సంవత్సరాల లో ప్రభుత్వం కృషి చేసింది’’

‘‘గత నలభైసంవత్సరాలుగా పెండింగు పడ్డ బెంగళూరు ప్రజల కలల ను నెరవేర్చడం కోసం రాబోయే 40 నెలల లో నేను కఠోరం గా శ్రమిస్తాను’’

‘‘భారతీయ రైల్ వేస్ మరింత వేగవంతం గా, మరింత స్వచ్ఛం గా, మరింత ఆధునికం గా, మరింత సురక్షితం గానే కాకుండా పౌరుల కుస్నేహపూర్ణం గా కూడా మారుతోంది’’

‘‘ఒకప్పుడు విమానాశ్రయాల లో మరియు విమాన ప్రయాణం లో మాత్రమే లభ్యమైన సదుపాయాలను, అనుభూతి ని అందించడం కోసం భారతీయ రైల్ వేస్ ప్రస్తుతం ప్రయత్నిస్తోంది’’

‘‘ప్రభుత్వం సదుపాయాల ను సమకూర్చి, పౌరుల జీవితాల లో జోక్యాన్ని కనీసస్థాయి కి తగ్గించినట్లయితే భారతీయ యువత ఏమి చేసిచూపించగలదనేది బెంగళూరు చాటిచెప్పింది’’

‘‘ఒక సంస్థ అది ప్రభుత్వానిది అయినా, లేక ప్రైవేటు రంగం లోది అయినా ఆ రెండూదేశం యొక్క ఆస్తులే, కాబట్టి ప్రతి ఒక్కరికీ ఆట ఆడేందుకు సమానమైన అవకాశాలు లభించాలిఅని నేను నమ్ముతాను’’

Posted On: 20 JUN 2022 4:51PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బెంగళూరు లో అనేక రైలు మరియు రోడ్డు మౌలిక సదుపాయాల పథకాల ను ప్రారంభించడం తో పాటుగా వాటి లో కొన్ని పథకాల కు ఈ రోజు న శంకుస్థాపన లు కూడా చేశారు. ఈ ప్రాజెక్టు ల విలువ 27,000 కోట్ల రూపాయల కు పైగానే ఉంది. అంతక్రితం, ప్రధాన మంత్రి ఐఐఎస్ సి బెంగళూరు లో సెంటర్ ఫార్ బ్రెయిన్ రిసర్చ్ ను ప్రారంభించి, బాగ్ చీ పార్థసారథి మల్టి స్పెశలిటీ హాస్పిటల్ కు శంకుస్థాపన చేశారు. ఆయన డాక్టర్ బి.ఆర్. ఆంబేడ్ కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (బిఎఎస్ఇ) యూనివర్సిటీ యొక్క కొత్త కేంపస్ ను సైతం ప్రారంభించారు. అదే కేంపస్ లో భారత్ రత్న డాక్టర్ బి.ఆర్. ఆంబేడ్ కర్ యొక్క విగ్రహాన్ని ప్రధాన మంత్రి ఆవిష్కరించారు. టెక్నాలజీ హబ్స్ గా ఉన్నతీకరించిన 150 ఐటిఐ లను కూడా దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేశారు.

ఈ సందర్భం లో పాలుపంచుకొన్న వారి లో కర్నాటక గవర్నరు శ్రీ థావ‌ర్ చంద్ గెహ్ లోత్, కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మై, కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోశీ తదితరులు ఉన్నారు.

సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, కర్నాటక లో 5 నేశనల్ హైవే ప్రోజెక్టుల కు, 7 రైల్ వే ప్రోజెక్టుల కు ఈ రోజు న శంకుస్థాపన చేయడం తో పాటు కొంకణ్ రైల్ వే లో 100 శాతం విద్యుదీకరణ అనే చెప్పుకోదగినటువంటి ఒక మైలురాయి కి మనం సాక్షలు గా ఉన్నాం అన్నారు. ఈ ప్రాజెక్టు లు అన్నీ కూడాను కర్నాటక లో యువత కు, మధ్య తరగతి వర్గాని కి, రైతుల కు, శ్రమికుల కు, నవపారిశ్రామికవేత్తల కు సరికొత్త సదుపాయాల ను మరియు కొత్త అవకాశాల ను అందజేస్తాయన్నారు.

దేశం లో లక్షల మంది యువతీ యువకుల కు బెంగళూరు ఒక కలల నగరం గా ఉంది. ఈ నగరం ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్భావన ను ప్రతిబింబిస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘బెంగళూరు ను అభివృద్ధి చేయడం అంటే లక్షల మంది స్వప్నాల ను పెంచి పోషించడం అని చెప్పాలి. ఈ కారణం గానే గడచిన 8 సంవత్సరాల లో బెంగళూరు సామర్థ్యాల ను పెంపొందింప చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అవిరామం గా కృషి చేస్తోంది’’ అని ఆయన అన్నారు.

బెంగళూరు కు ట్రాఫిక్ జామ్ ల బారి నుంచి విముక్తి ని ప్రసాదించడం కోసం రైలు, రోడ్డు, మెట్రో, అండర్ పాస్, ఫ్లయ్ ఓవర్ ల వంటి మౌలిక సదుపాయాల ను బలోపేతం చేయడం వంటి సాధ్యమైన ప్రతి ప్రయత్నాన్ని డబల్ ఇంజన్ప్రభుత్వం చేస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. బెంగళూరు లోని శివారు ప్రాంతాల ను ఉత్తమమైన సంధానం తో జోడించడాని కి తన ప్రభుత్వం కట్టుబడి ఉంది అని కూడా ఆయన అన్నారు. గడచిన నాలుగు దశాబ్దాలు గా ఈ విధమైన చర్యల ను గురించిన మాటలను అదే పనిగా చెప్తూ రాగా, మరి ప్రస్తుత డబల్ ఇంజన్ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టుల ను ప్రస్తుత హయాం లో పూర్తి చేసేందుకు అవకాశాన్ని ప్రజలు ఇచ్చారని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ప్రాజెక్టుల ను సకాలం లో అందజేస్తాం అంటూ ప్రధాన మంత్రి తన వచనబద్ధత ను పునరుద్ఘాటించారు. గడచిన 40 సంవత్సరాల లో పెండింగు పడ్డ ప్రజల స్వప్నాల ను రాబోయే 40 నెలల్లో సాకారం చేయడాని కి తాను కఠోరం గా శ్రమిస్తానని ఆయన అన్నారు.

బెంగళూరు నగరాన్ని దాని శివారుల తో, శాటిలైట్ టౌన్ శిప్స్ తో బెంగళూరు శివారు రైలు ప్రోజెక్టు జత పరుస్తుంది. తద్ద్వారా ఇతర ప్రయోజనాలు అనేకం కూడా దక్కుతాయి అని ప్రధాన మంత్రి అన్నారు. అదే విధం గా, బెంగళూరు రింగు రోడ్డు ప్రోజెక్టు నగరం లో రద్దీ ని తగ్గిస్తుంది అని ఆయన అన్నారు.

గత 8 సంవత్సరాల లో ప్రభుత్వం రైలు సంధానం రూపురేఖల ను సంపూర్ణం గా మార్చివేసేందుకు కృషి చేసింది అని ప్రధాన మంత్రి వివరించారు. భారతీయ రైల్ వేస్ వేగవంతం గా, మరింత స్వచ్ఛం గా మారడం తో పాటు ఆధునికం గా , సురక్షితం గా మరియు పౌరుల కు అనుకూలం గా రూపుదిద్దుకొంటున్నాయి అని ఆయన తెలిపారు. ‘‘ఇదివరకు ఆలోచించడాని కి కూడా కష్టం గా ఉన్న దేశం లోని కొన్ని ప్రాంతాల కు మేం రైలు ను తీసుకు పోయాం. ఒకప్పుడు విమానాశ్రయాల లోను, విమాన ప్రయాణం లోను మాత్రమే లభించినటువంటి సదుపాయాల ను ప్రస్తుతం ప్రయాణికుల కు అందించడానికి ఇండియన్ రైల్ వేస్ ప్రయత్నిస్తోంది. బెంగళూరు లో ఆధునిక రైల్ వే స్టేశన్ కు భారత్ రత్న సర్ ఎమ్. విశ్వేశ్వరయ్య పేరు ను పెట్టడం అనేది సైతం దీనికి ఒక ప్రత్యక్ష ప్రమాణం గా ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఏకీకృత బహుళ విధ సంధానం యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ఈ మల్టిమోడల్ కనెక్టివిటీ అనే దానికి పిఎమ్ గతిశక్తి నేశనల్ మాస్టర్ ప్లాన్ ద్వారా ఒక కొత్త ఉత్తేజం లభిస్తోంది అని ఆయన ప్రస్తావించారు. త్వరలో ఏర్పాటు కాబోయే మల్టిమోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఈ దృష్టి కోణం లో ఒక భాగం అని ఆయన చెప్పారు. గతిశక్తి యొక్క స్ఫూర్తి తో చేపట్టేటటువంటి ఆ తరహా ప్రాజెక్టు లు యువత కు ఉపాధిని కల్పిస్తాయని, ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ను కూడా పటిష్టం చేస్తాయని ఆయన అన్నారు.

బెంగళూరు సాఫల్య గాథ 21వ శతాబ్దాని కి చెందిన భారతదేశాని కి ఆత్మనిర్భర్ భారత్గా మారేందుకు ప్రేరణ ను ఇస్తుందని ప్రధాన మంత్రి అన్నారు. ప్రభుత్వం గనుక సదుపాయాల ను సమకూర్చి, పౌరుల జీవితాల లో జోక్యాన్ని కనీస స్థాయి కి తగ్గించిన పక్షం లో భారతదేశ యువత ఏమి చేసి చూపించలుగుతుంతో బెంగళూరు చాటిచెప్పింది. బెంగళూరు దేశ యువతీయువకుల కలల నగరం గా ఉంది. మరి దీని వెనుక నవపారిశ్రామికత్వం, నూతన ఆవిష్కరణ లు, సార్వజనిక రంగాన్ని, అలాగే ప్రైవేటు రంగాన్ని సరి అయిన విధం గా వినియోగించుకోవడం వంటి అంశాలు అన్నీ ఉన్నాయి అని ఆయన అన్నారు. భారతదేశం లో ప్రైవేటు వ్యాపార సంస్థల భావన పట్ల అంతగా గౌరవం లేనటువంటి వారికి బెంగళూరు ఒక పాఠం గా నిలచింది అని ఆయన అన్నారు. 21వ శతాబ్ది కి చెందిన భారతదేశం ఎలాంటిది అంటే అది సంపద ను సృష్టించే వారి, ఉద్యోగాల ను అందించే వారి మరియు నూతన ఆవిష్కర్తల కు చెందిన భారతదేశం అంటూ ఆయన అభివర్ణించారు. ప్రపంచం లో అత్యంత యువ దేశం గా ఇది భారతదేశం యొక్క సంపదగాను, బలం గాను ఉంది అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

ఎమ్ఎస్ఎమ్ఇ కి ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి కూడా ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొన్నారు. ఎస్ఎమ్ఇ యొక్క నిర్వచనం లో మార్పు చోటు చేసుకోవడం తో వాటి వృద్ధి కి కొత్త దారులు బార్లా తెరచుకొన్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ భావన పట్ల విశ్వాసాని కి ఒక సూచిక గా భారతదేశం 200 కోట్ల రూపాయల వరకు విలువ కలిగిన కాంట్రాక్టుల లో విదేశీ ప్రాతినిధ్యాన్ని రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వ విభాగాల ను 25 శాతం స్థాయి వరకు కొనుగోళ్ళ ను ఎమ్ఎస్ఎమ్ఇ నుంచి జరపాలి అని ఆదేశించడమైంది అని ఆయన వివరించారు. ఎమ్ఎస్ఎమ్ఇ విభాగాని కి ఒక గొప్ప సంధాన కర్త గా జిఇఎమ్ (GeM) పోర్టల్ నిరూపణ అవుతోంది అని ఆయన అన్నారు.

స్టార్ట్-అప్ రంగం లో ప్రధానమైన కార్యసాధనల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఇదివరకటి దశాబ్దుల లో బిలియన్ డాలర్ కంపెనీ లు ఎన్ని ఏర్పడ్డాయి అనేది వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చును అన్నారు. అయితే, గత 8 సంవత్సరాల లో బిలియన్ డాలర్ కంపెనీల ను 100 కు పైగా సృష్టించడం జరిగింది. అంతేకాదు, ప్రతి నెలా కొత్త కంపెనీల ను ఈ జాబితా కు చేర్చడం జరుగుతోంది అని ఆయన వివరించారు. మొదటి 10,000 స్టార్ట్-అప్ లు ఏర్పాటు కావడానికి 2014వ సంవత్సరం అనంతరం 800 రోజుల వ్యవధి పట్టగా, ప్రస్తుతం అదే సంఖ్య లో స్టార్ట్-అప్ లు 200 రోజుల కన్నా తక్కువ వ్యవధి లోనే జత అవుతున్నాయి అని ప్రధాన మంత్రి వెల్లడించారు. గత 8 సంవత్సరాల లో ఏర్పాటైన యూనికార్న్ స్ యొక్క విలువ దాదాపుగా 12 లక్షల కోట్ల రూపాయలు గా ఉంది అని ఆయన అన్నారు.

ఒక సంస్థ అది ప్రభుత్వాని కి చెందినదా, లేక ప్రైవేటు రంగం లో ఉన్నదా అనే విషయం చూసినట్లయితే ఆ రెండూ కూడా దేశం యొక్క ఆస్తులే అని తాను స్పష్టం గా నమ్ముతానని ప్రధాన మంత్రి అన్నారు. అంటే ప్రతి ఒక్కరికీ సమానమైన ఆట ను ఆడే అవకాశాల ను అందించాలి అని ఆయన చెప్పారు. దేశం లో యువతీ యువకులు వారి యొక్క దృష్టి కోణాన్ని, వారి ఆలోచనల ను ప్రపంచ శ్రేణి కేంద్రాల లో నిరూపించుకోవాలంటూ ఆయన ఆహ్వానం పలికారు. యువత కు ప్రభుత్వం వేదిక ను కల్పిస్తున్నదని ఆయన అన్నారు. ప్రభుత్వ కంపెనీ లు సైతం సమానమైన అవకాశాలు లభించే మైదానం లో పోటీ పడతాయి అని చెప్తూ, ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

ప్రాజెక్టుల వివరాలు:

బెంగళూరు సబ్ అర్బన్ ప్రాజెక్టు (బిఎస్ఆర్ పి) బెంగళూరు నగరాన్ని ఆ నగర శివారుల తో మరియు శాటిలైట్ టౌన్ శిప్ లతో కలుపుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 15,700 కోట్ల రూపాయల కు పైగానే; దీనిలో భాగం గా 4 కారిడార్ లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తం రూట్ నిడివి 148 కిలో మీటర్ లకు పైగా ఉంటుంది. సుమారు 500 కోట్ల రూపాయల వ్యయం అయ్యే బెంగళూరు కంటోన్మెంట్ పునరభివృద్ధి పథకాని కి, 375 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే యశ్వంత్ పుర్ జంక్షన్ రైల్ వే స్టేశన్ పునరభివృద్ధి పథకాని కి కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన లు చేశారు.

ఈ కార్యక్రమం లో భాగం గా, ప్రధాన మంత్రి భారతదేశం లో మొట్టమొదటి ఎయర్ కండిశన్ సదుపాయం కలిగిన రైల్ వే స్టేశన్ అయినటువంటి సర్ ఎమ్. విశ్వేశ్వరయ్య రైల్ వే స్టేశన్ బయ్యప్పనహళ్ళి లో ఏర్పాటు కాగా ఆ రైల్ వే స్టేశన్ ను దేశ ప్రజల కు అంకితం చేశారు. సర్ ఎమ్. విశ్వేశ్వరయ్య రైల్ వే స్టేశన్ ను ఒక ఆధునిక విమానాశ్రయం కోవ లో మొత్తం ఇంచుమించు 315 కోట్ల రూపాయల వ్యయం తో అభివృద్ధి పరచడం జరిగింది. కొంకణ్ రైలు మార్గం లో మహారాష్ట్ర లోని రోహా నుంచి కర్నాటక లోని తోకూర్ వరకు (దాదాపు గా 740 కిలో మీటర్ ల మేర) 100 శాతం విద్యుదీకరణ పనులు పూర్తి అయిన రైలు మార్గాన్ని ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేశారు. ఈ మార్గాని కి ప్రారంభ సూచకం గా ఉడుపి, మడగాఁవ్ మరియు రత్నగిరి ల నుంచి సాగే ఎలక్ట్రిక్ ట్రైన్స్ కు ఆయన జెండా ను చూపారు. 1280 కోట్ల రూపాయల కు పై చిలుకు వ్యయం తో కొంకణ్ రైల్ వే లైను ను విద్యుదీకరించడం జరిగింది. రెండు రైల్ వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టులు అయినటువంటి అర్సికెరె నుంచి తుమకురు వరకు (సుమారు 96 కి.మీ.) మరియు ఎలహంక నుంచి పెనుకొండ వరకు (దాదాపుగా 120 కి.మీ.) లను కూడా ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేశారు. ఆయా మార్గాల లో ప్రయాణికుల రైళ్ళ కు మరియు ఎమ్ఇఎమ్ యు సర్వీసు కు ఆయన ప్రారంభ సూచక జెండా లను చూపారు. ఈ రెండు రైలు మార్గాల డబ్లింగ్ పథకాల కు వరుస గా 750 కోట్ల రూపాయల కు పైచిలుకు మరియు 1100 కోట్ల రూపాయలు వ్యయం అయింది.

కార్యక్రమం లో భాగం గా, ప్రధాన మంత్రి బెంగళూరు రింగు రోడ్డు ప్రాజెక్టు తాలూకు రెండు సెక్షన్ లకు కూడా శంకుస్థాపన చేశారు. 2280 కోట్ల రూపాయల పైచిలుకు వ్యయం తో అభివృద్ధి చేయనున్న ఈ ప్రోజెక్టు నగరాని కి వాహన రాకపోక ల రద్దీ ని తగ్గించడం లో సహాయకారి కాగలదు. ప్రధాన మంత్రి మరికొన్ని రోడ్డు ప్రాజెక్టుల కు కూడా శంకుస్థాపన లు చేశారు. వాటిలో ఎన్ హెచ్-48 లోని నీలమంగళ- తుమకూరు సెక్షను ను 6 దోవలు కలిగి ఉండేదిగా విస్తరించడం; ఎన్ హెచ్-73 లోని పుంజల్ కట్టి- చర్ మాడి సెక్షను విస్తరణ పనులు; ఎన్ హెచ్- 69 లో ఒక సెక్షను ను ఉన్నతీకరించడం వంటివి భాగం గా ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కు అయ్యే మొత్తం వ్యయం దాదాపు గా 3150 కోట్ల రూపాయలు గా ఉంది. ప్రధాన మంత్రి మల్టిమోడల్ లాజిస్టిక్ పార్క్ కు కూడా పునాది రాయి ని వేశారు. ఈ పార్కు ను సుమారు 1800 కోట్ల రూపాయల వ్యయం తో బెంగళూరు నుంచి దాదాపు 40 కిమీ దూరం లో ఉన్న ముద్దలింగనహళ్ళి లో ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ లాజిస్టిక్స్ పార్క్ రవాణా, హ్యాండ్లింగ్ మరియు సెకండరీ ఫ్రైట్ వ్యయాల ను తగ్గించడం లో తోడ్పడనుంది.

***

DS/AK

 

 



(Release ID: 1835741) Visitor Counter : 134