ప్రధాన మంత్రి కార్యాలయం
‘సాంకేతికత అండదండల తో భారతదేశానికి 8 సంవత్సరాలు’ వివరాల ను శేర్ చేసిన ప్రధాన మంత్రి
Posted On:
10 JUN 2022 4:10PM by PIB Hyderabad
గడచిన ఎనిమిది సంవత్సరాల లో, సాంకేతిక విజ్ఞానం మరియు నూతన ఆవిష్కరణల ఉపయోగం ఆర్థిక వ్యవస్థ లోని ప్రతి ఒక్క రంగాన్ని ఏ విధం గా మార్చివేసిందీ తెలిపే కార్యక్రమాల ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి తన వెబ్ సైట్ అయిన narendramodi.in నుంచి వ్యాసాల ను మరియు MyGov నుంచి ఒక చిత్రమాలిక తో ఉన్న ట్వీట్ ను శేర్ చేశారు.
ప్రదాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘సాంకేతిక విజ్ఞానాని కి అర్థం మరింత అధికమైనటువంటి పారదర్శకత్వం.
సాంకేతిక విజ్ఞానాని కి అర్థం ‘జీవన సౌలభ్యం’ పెంపొందడం.
గడచిన 8 సంవత్సరాల లో సాంకేతిక విజ్ఞానం లో పడినటువంటి అనేకమైన ముందడుగు లు మిమ్ములను సంతోషపెడతాయి. #8YearsOfTechPoweredIndia”
‘‘పాలన కు మరియు పేద ప్రజల కు సేవ చేయడానికి సాంకేతిక విజ్ఞానాన్ని, నూతన ఆవిష్కరణల ను ఉపయోగించుకోవడం లో భారతదేశం మార్గదర్శి గా ఉంది. గత ఎనిమిది సంవత్సరాల లో మేం ఆర్థిక వ్యవస్థ లో ప్రతి ఒక్క రంగాన్ని మరింత మెరుగ్గా మార్చివేశాం. ప్రధాన సంస్కరణల లో కొన్నిటిని గురించి ఇక్కడ చదవగలరు. #8YearsOfTechPoweredIndia” అని పేర్కొన్నారు.
DS
(Release ID: 1832983)
Visitor Counter : 121
Read this release in:
Kannada
,
Odia
,
Assamese
,
Tamil
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati