ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కర్నాటక లోని కలబురగి లో ఒక ప్రమాదం కారణం గా ప్రాణ నష్టం జరిగినందుకుసంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి 

Posted On: 03 JUN 2022 5:57PM by PIB Hyderabad

కర్నాటక లోని కలబురగి లో జరిగిన ఒక ప్రమాద ఘటన లో ప్రాణ నష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘కర్నాటక లోని కలబురగి జిల్లా లో జరిగిన దుర్ఘటన తో దుఃఖిస్తున్నాను. ఈ విషాద దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి బంధువుల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ ఘటన లో గాయపడ్డ వారు అతి త్వరగా కోలుకోవాలి అని నేను ఆశపడుతున్నాను. బాధితుల కు స్థానిక పాలన యంత్రాంగం సాయాన్ని అందిస్తోంది: ప్రధాన మంత్రి @narendramodi’’ అని తెలిపింది.

 

******

DS/ST

 

 


(Release ID: 1831127)