ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

క‌ర్నాట‌క‌ లోని హుబ్బళ్లి లో జ‌రిగిన దుర్ఘ‌ట‌న‌ లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన‌ మంత్రి


పిఎమ్ఎన్ ఆర్ ఎఫ్ నుంచి పరిహారాన్ని ప్రకటించారు

Posted On: 24 MAY 2022 6:05PM by PIB Hyderabad

క‌ర్నాట‌క‌ లోని హుబ్బళ్లి లో జ‌రిగిన దుర్ఘ‌ట‌న‌ లో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రగాఢ దు:ఖాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క దగ్గరి సంబంధికుల‌ కు ప్ర‌ధాన‌ మంత్రి 2 జాతీయ సహాయ నిధి (పిఎమ్ ఎన్ఆర్ఎఫ్) నుంచి రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల వంతున మరియు గాయ‌ప‌డ్డ వ్యక్తుల కు 50,000 రూపాయ‌ల‌ వంతు న పరిహారాన్ని ఇవ్వనున్నట్లు ప్రధాన మంత్రి ప్ర‌క‌టించారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

క‌ర్నాట‌క‌ లోని హుబ్బళ్లి లో జ‌రిగిన దుర్ఘ‌ట‌న‌ లో ప్రాణ నష్టం వాటిల్లిందని తెలుసుకొని దు:ఖిస్తున్నాను.  ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను.  ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారు త్వరలోనే కోలుకోవాలి అని నేను కోరుకొంటున్నాను : ప్రధాన మంత్రి  @narendramodi’’

 

‘‘హుబ్బళ్లి లో జరిగిన దుర్ఘటన లో ప్రాణాలను కోల్సోయిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల వంతు న పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది.  గాయపడ్డ ప్రతి ఒక్క వ్యక్తి కి 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి  @narendramodi’’ అని తెలిపింది.

 



(Release ID: 1828107) Visitor Counter : 136