భారత ఎన్నికల సంఘం

2022-24 సంవత్సరానికి ఆసియా ఎన్నికల అధికారుల సంఘం (ఏఏఈఏ)కి భారతదేశం అధ్యక్ష హోదాకు ఎన్నికైంది

Posted On: 11 MAY 2022 12:19PM by PIB Hyderabad

మే 7, 2022న ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డ్ అండ్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో 2022-2024 కోసం అసోసియేషన్ ఆఫ్ ఆసియా ఎలక్షన్ అథారిటీస్ (ఏఏఈఏ)కి భారతదేశం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఎన్నికల కమిషన్, మనీలా ఏఏఈఏకి ప్రస్తుతం అధ్యక్ష హోదాలో ఉంది. ఎగ్జిక్యూటివ్ బోర్డులో ఇప్పుడు రష్యా, ఉజ్బెకిస్తాన్, శ్రీలంక, మాల్దీవులు, తైవాన్ మరియు ఫిలిప్పీన్స్‌లు కొత్త సభ్య దేశాలుగా ఉంటాయి.

image.png
డిప్యూటీ ఎలక్షన్ కమీషనర్ శ్రీ నితేష్ వ్యాస్ నేతృత్వంలోని భారత ఎన్నికల కమిషన్ 3 సభ్యుల ప్రతినిధి బృందం మణిపూర్ సిఇఒ శ్రీ రాజేష్ అగర్ల్ మరియు రాజస్థాన్ సిఇఒ శ్రీ ప్రవీణ్ గుప్తాతో పాటు మనీలాలో జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశానికి హాజరై 2022-23కి సంబంధించిన వర్క్ ప్లాన్‌తో పాటు ఎగ్జిక్యూటివ్ బోర్డుకి 2023-24 కోసం భవిష్యత్తు కార్యకలాపాలకు సంబంధించిన నివేదికను కూడా అందించింది. సమ్మిళిత మరియు భాగస్వామ్య ఎన్నికల కోసం మరియు రాజకీయ ప్రక్రియలలో సామాజిక-రాజకీయ అడ్డంకులను ఛేదించడానికి భారతదేశం చేసిన వివిధ సమిష్టి మరియు లక్ష్య జోక్యాలను హైలైట్ చేస్తూ 'ఎన్నికలలో లింగ సమస్యలు'పై ఒక ప్రదర్శన కూడా ఇవ్వబడింది.

సుపరిపాలనకు మద్దతిచ్చే లక్ష్యంతో బహిరంగ మరియు పారదర్శక ఎన్నికలను ప్రోత్సహించే మార్గాలపై చర్చించడానికి మరియు అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఎన్నికల అధికారుల మధ్య అనుభవాలు మరియు ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడానికి ఆసియా ప్రాంతంలో పక్షపాత రహిత ఫోరమ్‌ను అందించడం ఆసియా ఎన్నికల అధికారుల సంఘం యొక్క లక్ష్యం.

అనేక ఏఏఈఏ సభ్య దేశాల అధికారులు ఎప్పటికప్పుడు ఇండియా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ (ఐఐఐడీఈఎం) నిర్వహిస్తున్న అంతర్జాతీయ శిక్షణా కార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. 2019 నుండి ఏఏఈఏ సభ్య దేశాల నుండి 250 కంటే ఎక్కువ మంది అధికారులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఐఐఐడీఈఎం నిర్దిష్ట ఏఏఈఏ సభ్య దేశాల కోసం అనుకూలీకరించిన సామర్థ్య అభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. బంగ్లాదేశ్ ఎన్నికల కమిషన్‌లోని 50 మంది అధికారులు 2021-22లో శిక్షణ పొందారు.

భారత ఎన్నికల సంఘం నిర్వహించే అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమంలో ఏఏఈఏ నుండి ప్రతినిధులు క్రమం తప్పకుండా పాల్గొంటున్నారు. 2022లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈసీఐ నిర్వహించిన 3వ అంతర్జాతీయ వర్చువల్ ఎలక్షన్ విజిటర్స్ ప్రోగ్రామ్ (ఐఈవిపి)లో 12 ఏఏఈఏ సభ్య దేశాల నుండి 62 మంది అధికారులు పాల్గొన్నారు.  118  సభ్య దేశాల వరల్డ్ ఎలక్షన్ బాడీస్ (ఏ-డబ్ల్యూఈబీ)లో ఏఏఈఏ అసోసియేట్ మెంబర్‌గా కూడా ఉంది.

ఏఏఈఏ స్థాపన మరియు సభ్యత్వం

జనవరి 26-29, 1997లో ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరిగిన ఇరవై ఒకటవ శతాబ్ద ఆసియా ఎన్నికలపై జరిగిన సింపోజియంలో పాల్గొనేవారు ఆమోదించిన తీర్మానం ప్రకారం 1998లో అసోసియేషన్ ఆఫ్ ఆసియా ఎలక్షన్ అథారిటీస్ (ఏఏఈఏ) స్థాపించబడింది. ప్రస్తుతం 20 ఆసియా ఈఎంబిలు ఏఏఈఏ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈసీఐ ఏఏఈఏ యొక్క వ్యవస్థాపక సభ్యత్వం  మరియు 2011-13 సమయంలో వైస్ చైర్‌గా మరియు 2014-16లో ఛైర్‌గా ఏఏఈఏ  యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డ్‌లో కూడా పనిచేసింది.


 

****



(Release ID: 1824562) Visitor Counter : 210