ప్రధాన మంత్రి కార్యాలయం

బ్రెజిల్ ‘డెఫ్లింపిక్స్‌-2021’లో పాల్గొంటున్న క్రీడాకారులకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

Posted On: 01 MAY 2022 7:35PM by PIB Hyderabad

   బ్రెజిల్‌లో నిర్వ‌హిస్తున్న “బ‌ధిర ఒలింపిక్స్ (డెఫ్లింపిక్స్)-2021”లో పాల్గొంటున్న ప్రతిభావంతులైన భారత క్రీడాకారులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రీడలకు బ‌య‌ల్దేరే ముందు వారు జాతీయ యుద్ధ‌స్మార‌కాన్ని సంద‌ర్శించి నివాళి అర్పించ‌డం త‌న హృద‌యాన్ని తాకింద‌ని శ్రీ మోదీ ఈ సంద‌ర్భంగా చెప్పారు.

ఈ మేర‌కు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో;

“జ‌ర్మ‌నీలో ఇవాళ ప్రారంభమ‌య్యే #Deaflympics2021లో పాల్గొనే భార‌త బృందాన్ని భార‌త‌దేశం హ‌ర్ష‌ధ్వానాల‌తో ఉత్సాహప‌రుస్తోంది. ప్రతిభావంతులైన మ‌న క్రీడాకారుల‌ద‌రికీ శుభాకాంక్షలు. ఈ క్రీడోత్స‌వాల‌కు బ‌య‌ల్దేరేముందు వారంతా జాతీయ యుద్ధ స్మార‌కాన్ని సంద‌ర్శించి నివాళి అర్పించ‌డం నిజంగా న‌న్నెంత‌గానో క‌దిలించింది” అని ప్ర‌ధాని పేర్కొన్నారు.

*****

DS/ST



(Release ID: 1821998) Visitor Counter : 127