ప్రధాన మంత్రి కార్యాలయం

గుజరాత్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

Posted On: 01 MAY 2022 8:51AM by PIB Hyderabad

గుజరాత్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

“గుజరాత్‌ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ వంటి అనేకమంది మహనీయుల ఆదర్శాల స్పూర్తితో గుజరాత్ ప్రజలు సాధించిన వైవిధ్యమైన విజయాలు విస్తృత ప్రశంసలు అందుకుంటున్నాయి. భవిష్యత్తులోనూ గుజరాత్ ఇదేవిధంగా ప్రగతి పథంలో పరుగు తీస్తూనే ఉండాలి” అని ప్రధాని పేర్కొన్నారు.

***

DS/SH

 



(Release ID: 1821846) Visitor Counter : 128